చచ్చిపోతాం.. అనుమతి ఇవ్వండి : రాజధాని రైతులు

రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,

  • Published By: veegamteam ,Published On : December 31, 2019 / 03:29 PM IST
చచ్చిపోతాం.. అనుమతి ఇవ్వండి : రాజధాని రైతులు

Updated On : December 31, 2019 / 3:29 PM IST

రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని,

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని లేఖలో కోరారు. రాజధాని విషయంలో మోసపోయామని, చనిపోయే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో తామంతా రోడ్డున పడ్డామని రైతులు వాపోయారు. నాడు అమరావతి రాజధానికి అంగీకారం తెలిపిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి స్వలాభం కోసం సీఎం జగన్.. రాజధానిని విశాఖకు తరలించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 14 రోజులుగా కుటుంబాలతో కలిసి ఆందోళనలు చేస్తున్నా తమ గోడు వినిపించుకున్నవారు లేరని రైతులు వాపోయారు.
 
రాష్ట్రపతికి రైతులు రాసిన లేఖ:
‘‘అధికార పార్టీ నేతలు మా త్యాగాన్ని హేళన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అంటగడుతున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్‌ ఆర్టిస్టులని.. మంత్రులు, ఎమ్మెల్యేలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రశ్నిస్తే మాపై దాడులకు దిగుతున్నారు. అధికారం అడ్డు పెట్టుకుని అర్ధరాత్రి మా ఇళ్లపైకి పోలీసులను పంపి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మా పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. అండగా నిలవాల్సిన ప్రభుత్వమే మాపై కక్ష కట్టింది. రాజధాని తరలిపోతే మేము జీవచ్ఛవాలుగా మిగిలిపోతాం. ఈ బతుకులు మాకొద్దు.. మాకు మరణమే శరణ్యం. దయ ఉంచి కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి’’.

Also Read : పెరిగిన రైల్వే ఛార్జీలు…అర్ధరాత్రి నుంచి అమల్లోకి