Andhra Pradesh : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం 101 కరోనా కేసులు నమోదు కాగా.. మంగళవారం కేసుల సంఖ్య 184గా నమోదైంది.

Andhra Pradesh : స్వల్పంగా పెరిగిన రోజువారీ కరోనా కేసులు

Ap Corona Cases

Updated On : November 30, 2021 / 5:29 PM IST

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం 101 కరోనా కేసులు నమోదు కాగా.. మంగళవారం కేసుల సంఖ్య 184గా నమోదైంది. కరోనాతో ముగ్గురు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 134 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,04,17,082 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,909 కు పెరిగింది.

చదవండి : Corona Virus: ఒమిక్రాన్‌పై WHO సూచనలు.. ముఖ్యమైన 5పాయింట్లు ఇవే!

కరోనా నుంచి 20,56,318 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,442 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 2,149 గా ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొంది ఆరోగ్యశాఖ.

చదవండి : Corona Virus: సెకండ్ వేవ్‍కి కారణమైన డెల్టా కంటే 6 రెట్లు వేగంగా ఓమిక్రాన్ వ్యాప్తి.. వ్యాక్సిన్ కూడా పనిచేయట్లేదు