ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

  • Published By: veegamteam ,Published On : June 29, 2020 / 05:19 AM IST
ఏపీలో భయపెడుతున్న కరోనా కేసులు

Updated On : June 29, 2020 / 5:19 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జూన్27 శుక్రవారం ఉదయం 9 గంటలనుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 740 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగశాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోన్నారు.

 

జూన్ 27 24,458 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 740మందికి పాజిటివ్ అని తేలింది.గత 24 గంటల్లో 263 మంది కరోనా వైరస్ బారినుంచి చికిత్స పొంది ఇళ్లకు తిరిగి వెళ్ళారు.

 

కోవిడ్ బారిన పడి కర్నూల్ జిల్లా లో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరూ, విజయనగరం జిల్లాలో ఒక్కరూ మరణించారు. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 6,648 మంది కోవిడ్ కు చికిత్స పొందుతున్నారు.

Read: ఏపీ ఆర్టీసీలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు.. క్లారిటీ ఇచ్చిన ఎండీ