Thalliki Vandanam: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.15వేలు డబ్బులు.. తల్లికి వందనం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్

ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.

Thalliki Vandanam: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. రేపే ఖాతాల్లోకి రూ.15వేలు డబ్బులు.. తల్లికి వందనం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్

Updated On : June 11, 2025 / 6:48 PM IST

Thalliki Vandanam: సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. సూపర్ సిక్స్ లో మరో ముఖ్యమైన హామీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు(జూన్ 12) తల్లులకు కానుకగా తల్లికి వందనం అమలు చేయనున్నారు. రేపే తల్లికి వందనం నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 15వేలు జమ కానున్నాయి. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది ప్రభుత్వం.

ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మ్యానిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు. 67లక్షల 27వేల 164 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకాన్ని వర్తింప జేయనున్నారు. తల్లికి వందనం స్కీమ్ కింద తల్లుల ఖాతాల్లో రూ.8వేల 745 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.

Also Read: టీడీపీ ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు హితబోధ.. వన్‌ టైమ్‌ ఎమ్మెల్యేగా మిగిలిపోతామంటే మీ ఇష్టమంటూ..

1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్టియర్ లో చేరే విద్యార్ధులకు కూడా తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తై డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. విధి విధానాలను ఖరారు చేస్తూ నేడు జీవో విడుదల చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పెన్షన్లు పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసింది కూటమి ప్రభుత్వం.