Jagan Bus Yatra : శ్రీకాకుళం జిల్లాలో సీఏం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. షెడ్యూల్ ఇలా
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
CM Jagan Memantha Siddham Bus Yatra : వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది. ఇవాళ టెక్కలిలో జరిగే బహిరంగ సభతో బస్సుయాత్ర ముగుస్తుంది. దీంతో టెక్కలి ముగింపు సభకు వైసీపీ నేతలు భారీ జనసమీకరణ చేస్తున్నారు. యాత్రలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గం అక్కివలస నుంచి ఇవాళ ఉదయం 9గంటలకు బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. చిలకపాలెం జంక్షన్, ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం టౌన్ బైపాస్ మీదుగా పల్లివలస, నరసన్నపేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా జగన్ బస్సుయాత్ర టెక్కలి నియోజకవర్గం వరకు సాగనుంది.
టెక్కలి నియోజకవర్గం పరశురాంపురం జంక్షన్ సమీపంలో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు టెక్కలి నియోజకవర్గం అక్కవరంలో భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సాయంత్రం 5.20 గంటల వరకు జగన్ సభలో ప్రసంగిస్తారు. టెక్కలిలో మేమంతా సిద్ధం సభతో బస్సుయాత్ర ముగుస్తుంది. అనంతరం జగన్ మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో విశాఖపట్టణంకు చేరుకుంటారు. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లనున్న జగన్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంకు సీఎం జగన్ చేరుకుంటారు.
Also Read : KTR Comments : చట్ట సభలకు పంపితే.. కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చీల్చాడు : కేటీఆర్