Gollapalli Surya Rao: టీడీపీకి బిగ్‌షాక్‌.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి

అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు.

Gollapalli Surya Rao: టీడీపీకి బిగ్‌షాక్‌.. జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి

Gollapalli Surya Rao

Gollapalli Surya Rao Quits TDP : అసెంబ్లీ ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపించారు. ఇటీవల టీడీపీ – జనసేన కూటమి తరపున ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో టికెట్ దక్కని ఆశావహులు ఆందోళనకు దిగుతున్నారు. పలువురు టీడీపీని వీడుతున్నారు. తాజాగా గొల్లపల్లి సూర్యారావుసైతం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ మోహన్  రెడ్డిని కలిసి ఆయన సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు.

Also Read : Magunta Sreenivasulu Reddy: ఇంతకాలం మాకు అండగా నిలిచిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు

గొల్లపల్లి సూర్యారావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లోనూ రాజోలు నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి బరిలోకి దిగుతాడని ఇటీవల పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాజోలులో పోటీకి అవకాశం లేకుంటే పీ గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల నుంచి టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తుందని గొల్లపల్లి భావించారు. కానీ, టీడీపీ – జనసేన మొదటి జాబితాలో గొల్లపల్లి సూర్యారావు పేరు లేకపోటంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీ మారాలని ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి రావడంతో బుధవారం సీఎం జగన్ సమక్షంలో అధికార వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎవరు? ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు..!

మంగళవారమే తాడేపల్లికి వచ్చిన గొల్లపల్లి సూర్యారావు పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి, కేశినేని నానితో భేటీ అయ్యారు. వైసీపీలో చేరిన తరువాత గొల్లపల్లికి ఏ నియోజకవర్గం నుంచి టికెట్ ఇస్తారనే అంశంపై చర్చ జరిగినట్లు తెలిసింది. టీడీపీకి రాజీనామా చేయడంతో తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్ రెడ్డిని కలిసి గొల్లపల్లి సూర్యారావు.. వైసీపీ కండువా కప్పుకున్నారు. అయితే, సూర్యారావును ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.