టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ప్రకటించిన ముద్రగడ
మాగంటి-ముద్రగడ సమావేశం ఆసక్తికరంగా మారింది. ఏపీ ఎన్నికల వేళ ఇప్పటికే అభ్యర్థుల జాబితాపై టీడీపీ-జనసేన..
![టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ప్రకటించిన ముద్రగడ టీడీపీ, జనసేన పొత్తుకు మద్దతు ప్రకటించిన ముద్రగడ](https://10tv.in/wp-content/uploads/2024/02/mudragada.jpg)
mudragada
Mudragada Padmanabham: ఏలూరులోని టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు నివాసానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వచ్చారు. మాగంటి బాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ. నిన్న చింతలపూడిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన విషయం తెలిసిందే.
సభ జరిగిన నేపథ్యంలో మాగంటి – ముద్రగడ సమావేశం ఆసక్తికరంగా మారింది. తాజా రాజకీయ అంశాలపైనా ఇరువురి మధ్య చర్చ జరగింది. టీడీపీ – జనసేన పొత్తుకు తన మద్దతు ఉంటుందని మాగంటి బాబుకు ముద్రగడ తెలిపారు. ఏపీ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం కూడా పోటీ చేసే అవకాశం ఉంది.
టీడీపీ-జనసేన త్వరలోనే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలపై ఇరు పార్టీల అధినేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. టికెట్లు దొరకని నేతలకు తమ ప్రభుత్వం ఏర్పాడ్డాక అందులో పదువులు, పార్టీ పర పదవులు ఇవ్వాలని ఇరు పార్టీలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
KCR : తెలంగాణ భవన్కు కేసీఆర్.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు.. సీఎం సీఎం అంటూ నినాదాలు