YCP : ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

YCP : ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

YCP

Updated On : December 14, 2023 / 4:14 PM IST

YCP Complains To EC : కేంద్ర ఎన్నికల కమిషన్ ను వైసీపీ నేతలు కలిశారు. ఏపీలో ఓట్ల తొలగింపు అంశంపై ఈసీ అధికారులతో విజయసాయి రెడ్డి, ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం ఏపీలో భారీగా దొంగ ఓట్లను చేర్చిందని, వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫొటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాల్లో ఓటర్లుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదు చేశారని ఆరోపించారు. హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా నమోదు చేయించారని ఆరోపించారు.

Vizag Fire Accident: ఇండస్ హాస్పిటల్ లో అగ్ని ప్రమాదం

దొంగ ఓటర్లను తొలగిస్తున్న బూత్ లెవల్ అధికారులపై టీడీపీ దాడులు చేస్తుందని ఫిర్యాదు చేశారు. వైసీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులను టీడీపీ నేతలు బీఎల్ఓలకు సమర్పిస్తున్నారని వైసీపీ నేతలు ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. విచారణ సమయంలో నిజాలు వెలుగుచూస్తుండటంతో బీఎల్ఓలను బెదిరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు.