వైసీపీ ఫైనల్ లిస్ట్ రెడీ..! సీట్లు గల్లంతయ్యే ఎమ్మెల్యేలు వీరే..!

వైసీపీ ఫైనల్ లిస్ట్ రెడీ..! సీట్లు గల్లంతయ్యే ఎమ్మెల్యేలు వీరే..!

YCP Final List To Be Released

Updated On : January 15, 2024 / 11:00 PM IST

YCP Final List : వైసీపీ ఇంఛార్జీల మార్పు వ్యవహారం తుది దశకు చేరుకుంది. మరో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మార్చేసి ఫైనల్ లిస్ట్ ను ప్రకటించేందుకు వైసీపీ అధిష్టానం కసరత్తును వేగవంతం చేసింది. ఇప్పటికే 59(50 అసెంబ్లీ, 9 ఎంపీ) నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు. మొదటి జాబితాలో 11మంది అభ్యర్థుల పేర్లను, రెండో జాబితాలో 27మంది(24 ఎమ్మెల్యే, 3 ఎంపీ) అభ్యర్థుల పేర్లను, మూడో జాబితాలో 21 (15 ఎమ్మెల్యే, 6 ఎంపీ) మంది అభ్యర్థుల పేర్లను మార్పుతో ప్రకటించింది వైసీపీ అధిష్టానం. టికెట్ దక్కని నేతలు, స్థానం మారిన నేతలు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. తొలి మూడు జాబితాల్లో పేర్లు లేని నేతలు నాలుగో జాబితాలో అయినా తమ పేర్లు ఉంటాయని గంపెడాశలు పెట్టుకున్నారు.

ఇక సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ అధిష్టానం. ఈ నెల 17న లేదా 18న నాలుగో జాబితాను రిలీజ్ చేసే అవకాశం ఉంది. సర్వేల నివేదికల ద్వారా మరో 8 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తూ నాలుగో జాబితాను రిలీజ్ చేయబోతున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మార్కాపూరం(నాగార్జున రెడ్డి), గిద్దలూరు(అన్నా రాంబాబు), తిరువూరు(రక్షణ నిధి), గంగాధర నెల్లూరు(నారాయణ స్వామి), యలమంచిలి(కన్నా బాబు రాజు), సూళ్లూరుపేట(సంజీవయ్య), నందికొట్కూరు(తొగూరు ఆర్ధర్), సింగనమల(జొన్నలగడ్డ పద్మావతి) నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ లను మార్చబోతున్నట్లుగా తెలుస్తోంది.

Also Read : ఈ సీట్లపైనే పీటముడి.. ఒకే నియోజకవర్గంలో బలమున్న టీడీపీ, జనసేన నేతలు వీరే..

మార్కాపురంలో ఎమ్మెల్యే నాగార్జున రెడ్డికి కాకుండా జంకె వెంకట రెడ్డికి టికెట్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. తిరువూరులో రక్షణ నిధిని కాదని టీడీపీ నుంచి చేరిన స్వామి దాస్ కు టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. యలమంచిలిలో కన్నబాబు రాజును తప్పించి గుడివాడ అమర్నాథ్ ను బరిలో దింపే ఛాన్స్ ఉంది. ఇదే చివరి జాబితా అని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. మిగిలిన వారంతా యధావిధిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వైసీపీ ఇంఛార్జీల మార్పునకు సంబంధించి కసరత్తు దాదాపుగా కొలిక్చి వచ్చింది. దాదాపు 60 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలని జగన్ నిర్ణయించారు. ఆ దిశగా 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ప్రకటించారు. మరో 8 స్థానాల్లో మార్పులకు సంబంధించి ప్రకటన సంక్రాంతి తర్వాత అంటే ఈ నెల 17న లేదా 18వ తేదీన ఉండబోతోందని సమాచారం. ఆ నియోజకవర్గాల ఇంఛార్జీలు, ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనూ సంప్రదింపులు చేశారు జగన్. కొత్త వాళ్లు ఎవరు వస్తారు అనే క్లారిటీతో వైసీపీ అధిష్టానం ఉంది. ఇన్ని రోజులు పక్కన పెడుతూ వచ్చిన ప్రధానమైన నియోజకవర్గాలకు సంబంధించి క్లియరెన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

కొత్తగా మార్పులు చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గాలను పరిశీలిస్తే..

* మార్కాపురం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డిని తప్పించి జంకె వెంకటరెడ్డికి అవకాశం ఇవ్వనున్నారు. జంకె వెంకట రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మారిన సమీకరణాల నేపథ్యంలో సీఎం జగన్ వెంకటరెడ్డిని పక్కన పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనకు టికెట్ ఇవ్వనున్నారు.

* గిద్దలూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యేగా అన్నా రాంబాబు ఉన్నారు. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదు, రాజకీయాల్లో ఉండటం లేదు అని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పార్టీ కోసం పని చేస్తాను తప్ప ఎన్నికల రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నా అని చెప్పారు. కాగా గిద్దలూరు స్థానం హాట్ టాపిక్ గా మారింది. సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి తన వర్గానికి చెందిన వ్యక్తికే గిద్దలూరు టికెట్ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు. గిద్దలూరికి ఎవరిని తీసుకొస్తారు అనేది హాట్ టాపిక్ అయ్యింది. దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ ని ఇప్పటికే అక్కడి నుంచి తప్పించారు. ఆయనను గిద్దలూరుకి పంపిస్తారా? లేదంటే.. సిద్ధా రాఘవయ్య కుమారుడికి అవకాశం ఇస్తారా? లేక బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించిన వ్యక్తికే గిద్దలూరు టికెట్ ఇస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

* కృష్ణా జిల్లా తిరువూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధిని తప్పించనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పార్టీ కార్యక్రమాలకు, అధినాయకత్వానికి దూరంగా ఉన్నారు. 4 రోజుల క్రితం టీడీపీ నుంచి వైసీపీలో చేరిన స్వామి దాస్ కు తిరువూరు టికెట్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్వామి దాస్ కేశినేని నాని వర్గీయుడు.

* గంగాధర నెల్లూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ స్వామి. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి. ఆయన స్థానంలో ఆయన కూతురు కృపా లక్ష్మికి టికెట్ ఇచ్చే ఛాన్స్.

* యలమంచిలి.. అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ కి యలమంచిలి టికెట్ ఇచ్చే ఛాన్స్.

* సూళ్లూరుపేట.. సిట్టింగ్ ఎమ్మెల్యే సంజీవయ్య.. ఆయనను మార్చబోతున్నారు. కొత్త వారికి అవకాశం.

Also Read : సంక్రాంతికి టీడీపీ ఫస్ట్‌ లిస్ట్‌.. ఇటు చంద్రబాబు, అటు లోకేశ్ వద్దకు నేతలు..

* నందికొట్కూరు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్.. ఆయనను తప్పించబోతున్నారు.. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డితో విభేదాలు. బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ఎవరి పేరు చెబితే వారికే టికెట్ ఇచ్చే అవకాశం. నందికొట్కూరు ఎమ్మెల్యేగా ఆర్థర్ ఉన్నప్పటికీ.. ఆ నియోజకవర్గ ఇంఛార్జిగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. ఆయన వర్గానికి చెందిన వారికే టికెట్ ఇచ్చే అవకాశం.

* శింగనమల.. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. టికెట్ లేదని చెప్పేసిన జగన్.. కొత్త వారికి టికెట్ ఇచ్చే అవకాశం..