Devi Navaratrulu 2025: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.

Devi Navaratrulu 2025: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

Devi navaratrulu 2025

Updated On : September 26, 2025 / 9:30 PM IST

Devi navaratrulu 2025: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేస్తారు. సెప్టెంబరు 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి.

ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గామాత సంహరించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు. (Devi navaratrulu 2025)

Also Read: గొప్ప తేజస్సు ఉన్న అమ్మవారు ఏకవీరా దేవి.. తమలపాకు, వక్కలను నూరి ప్రసాదంగా..

అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పండుగ. కానీ, ఈ సారి అమ్మవారు మొత్తం 11 అవతారాల్లో దర్శనమిస్తున్నారు.

  • దుర్గమ్మ అలంకరణలు

    • మొదటి రోజు – శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి
    • రెండో రోజు –  శ్రీ గాయత్రీ దేవి
    • మూడో రోజు – శ్రీ అన్నపూర్ణ మాత
    • నాలుగో రోజు –శ్రీ కాత్యాయనిదేవి
    • ఐదో రోజు – శ్రీమహాలక్ష్మీదేవి
    • ఆరో రోజు – శ్రీ లలితా త్రిపురసుందరీదేవి,
    • ఏడో రోజు – శ్రీ మహాచండీదేవి
    • ఎనిమిదో రోజు – శ్రీ సరస్వతిదేవి
    • తొమ్మిదో రోజు – శ్రీ దుర్గాదేవి
    • పదో రోజు – శ్రీ మహిషాసుర మర్దినీదేవి

విజయదశమి రోజన (అక్టోబరు 2) రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారు. అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. నైవేద్యంగా లడ్డూలు, రవ్వ కేసరి, చింతపండు పులిహోర పెడతారు.