Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి నేడు ధనలాభం, ప్రతి పనిలో విజయం..!
ఈ రోజు (2024, అక్టోబర్ 16 బుధవారం ) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ చతుర్దశి: రా 8:40, ఉత్తరాభాద్ర : 7:18 బుధవారము..
ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు
మేష రాశి: బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి, అధిక వ్యయం తగ్గించుకోవాలి, మానసిక ఆందోళనలు తగ్గించు కోవాలి, అనవసరపు విషయాల మీద జాగ్రత్తవహించాలి, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం. ఇండ్లు కొనుగోలో విషయాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ధనలాభం, ప్రతి పనిలో విజయం సాధించడం, శుభకార్య నిర్వాహణ, వృత్తి, ఉద్యోగములలో లాభం కలగడం, విజయం లభించడం, శుభవార్తలు, అభివృద్ది కలగడం, స్త్రీలకు విజయం నూతన వ్యాపారములలో విజయం. సుందర కాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
మిధున రాశి: విదేశాలకు వెళ్లే అవకాశములు కనపడటం, దూరపు ప్రయాణములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, గృహ ఉపకరణ వస్తువులు కొనడం, మంచి ఆలోచనలకు పదును పెట్టడం, గృహములో శుభకార్యక్రమములు నిర్వహించడం. ‘ఓం నమః శివాయ’ పంచాక్షరి చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
కర్కాటక రాశి: పనిలో ఆలస్యము, అధిక ఖర్చులు కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధు మిత్రులతో విరోధము, ప్రయాణంలో ప్రమాదములు జరగకుండా జగ్రత్త పడాలి. మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, భయము పెరుగుతుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తే శుభం కలుగుతుంది.
సింహ రాశి: ఆరోగ్య విషయంలో ఇబ్బందులు, విహహ విషయంలో ఆటంకములు, సరైన నిర్ణయము లేకపోవడం, మానసిక ప్రశాంతత లేకపోవడం, సర్దుబాటుతత్వం అలవర్చుకోవాలి, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, ప్రయాణంలో ఇబ్బందులు. ఇష్టదైవ ఆరాధన చేసినచో శుభ ఫలితములు కలుగుతాయి.
కన్యా రాశి: ప్రతి పనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి. శారీరక సుఖం కార్యసిద్ధి, శుభకార్యక్రమములో పాల్గొనుట, వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులలో లాభం, ధనాదాయం, గౌరవమర్యాదలు, కుటుంబంలో శుభములు – “ఓం నమో నారాయణాయ నమః” అష్టాక్షరి మంత్రము చదివినచో శుభం కలుగును.
తులా రాశి: పుణ్యములు చేయడం, గౌరవసన్మానములు, గృహములో శుభకార్యక్రమములు చేయడం, వధూవరులకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధనసమృద్ధి, విద్యార్థులకు అనుకూలం ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
వృశ్చిక రాశి: ధనవిషయంలో జాగ్రత్త అవసరము, వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరియైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురికావడం. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
ధనస్సు రాశి: బంధుమిత్ర వైరము, ప్రతి పనిలో ప్రతికూలత, ధనలాభం, వృత్తి ఉద్యోగములలో విజయం సాధించడం, మరచిపోవడం, అలసత్వం, ప్రయాణముల వలన లాభం కలగడం, సుఖనిద్ర, సమాజంలో గౌరవము. శ్రీ మహాలక్ష్మీ ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతుంది.
మకర రాశి: విలువైన ఆభరణములు కొనడం, గృహోపకరణ వస్తువులు కొనడం, కార్యములందు విజయం, శారీరక సౌఖ్యం, అన్నింటా అభివృద్ధి, ఆరోగ్యం కుదుటపడటం, స్త్రీలకు నూతన ఆలోచనలు పెరగడం, నూతన వస్త్రప్రాప్తి, ఆభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము. లలితా సహస్ర నామ పారాయణము చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.
కుంభ రాశి: వృత్తి వ్యాపారంలో శారీరక శ్రమ, ఆటంకములతో కూడిన విజయం, కుటుంబ సౌఖ్యం, సుఖ సంతోషములు, కోపంతో సమస్యలు, స్థాన చలనము, బంధు మిత్రుల కలయిక, గృహంలో మార్పులు, కుటుంబ వ్యక్తుల సహకారం. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.
మీన రాశి: అకస్మిక ప్రయూణములు, స్థాన చలనము, గృహములో మార్పులు, శుభమూలక ధనవ్యయం, శుభకార్యసిద్ధి, కోపంతో వివాదములు పెరుగుట, వస్తు వాహనములు కొనడం, అకస్మిక ధనలాభం, స్త్రీ మూలక వివాదములు, రుణ బాధ నివృత్తి. సుందర కాండ పారాయణం చేయడం వల్ల శుభం కలుగుతుంది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956