Gold Price: షాకిస్తున్న గోల్డ్ రేట్లు.. వామ్మో ఐదు రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా.. తెలుగు రాష్ట్రాల్లో అయితే..
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.

Gold
Gold Price: ఆషాఢ మాసంలో కాస్త తగ్గిన బంగారం ధరలు.. శ్రావణ మాసంలో భారీగా పెరుగుతున్నాయి. గడిచిన ఐదు రోజులుగా గోల్డ్ రేటు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. ఇవాళ కూడా బంగారం ధర పెరిగింది. ఆగస్టు 2వ తేదీ నుంచి ఇవాళ్టి వరకు గడిచిన ఐదు రోజుల్లో తులం బంగారంపై రూ. 2500 పెరిగింది.
బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 110 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 100 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై తొమ్మిది డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఔన్సు గోల్డ్ 3,371 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. వెయ్యి పెరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు..
♦ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర పెరిగింది.
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.93,800 చేరగా.. 24 క్యారట్ల ధర రూ.1,02,330కి చేరింది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో..
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,950కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,02,480కు చేరింది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.93,800 కాగా.. 24క్యారెట్ల ధర రూ.రూ.1,02,330కు చేరింది.
వెండి ధర ఇలా..
♦ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.1,26,000 వద్ద కొనసాగుతుంది.
♦ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,16,000 వద్దకు చేరింది.
♦ చెన్నైలో కిలో వెండి ధర రూ. 1,26,00 వద్ద కొనసాగుతుంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.