Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతో తెలుసా? భారీగా తగ్గిన వెండి ధర..

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే..

Gold Price Today : బంగారం కొనుగోలుదారులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతో తెలుసా? భారీగా తగ్గిన వెండి ధర..

Gold Price

Updated On : December 13, 2023 / 1:17 PM IST

Today Gold and Silver Rate: బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే, మీకు శుభవార్తే. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు తగ్గుకుంటూ వస్తున్నాయి. వారం రోజుల్లో 10 గ్రాముల బంగారంపై రూ. 1200 తగ్గింది. బుధవారంసైతం బంగారం ధర తగ్గింది. బుధవారం నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల 22క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 110 తగ్గింది.

Gold
తెలుగు రాష్ట్రాల్లో..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధరలు తగ్గాయి. బుధవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 56,650 కాగా, 24క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రూ. 61,800 కు చేరింది.

Gold Price Today

దేశంలోని ప్రధాన నగరాల్లో ..
– దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 61,950.
– ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 56,650 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,800కు చేరింది.
– చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 తగ్గగా.. 24 క్యారెట్ల బంగారంపై రూ. 220 తగ్గింది. దీంతో అక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.57,000 కాగా.. 24క్యారెట్ల గోల్డ్ రూ.62,180కు చేరింది.

Gold

తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా బుధవారం ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 700 తగ్గింది. గత ఏడు రోజులుగా వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. వారం రోజుల్లో కిలో వెండిపై సుమారు రూ. 6500 తగ్గింది. బుధవారం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 77,000కు చేరింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000. ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా ప్రాంతాలలో కిలో వెండి రూ.75,000కు చేరింది. బెంగళూరులో కిలో  వెండి రూ.73,500 వద్ద కొనసాగుతోంది.