Gold Rate Today : బంగారం కొనుగోలుకు ఇదే మంచి సమయం.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ధర ఎంతో తెలుసా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

Gold
Gold And Silver Price : మీరు బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారా? అయితే, గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి సమయం అని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ఈ నెల చివరి వారం నుంచి రెండు నెలలు పాటు పెళ్లిళ్లకు మహూర్తాలు ఉన్నాయి. మార్చి, ఏప్రిల్ నెలలో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. డిమాండ్ పెరిగితే ధరలుకూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో బంగారం కొనుగోలుచేసే ఉద్దేశం ఉన్నవారు ఇప్పుడు కొనుగోలు చేసుకోవటం మంచిది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం రేట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు ఇవాళ 2032 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇండియన్ రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే రూ. 83.057 వద్ద ఉంది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గితే వచ్చే రెండు నెలలు దేశంలో గోల్డ్ ధరలు తగ్గే అవకాశమూ లేకపోలేదు.
- తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా ..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ పట్టణాలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,990 కాగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,220 వద్ద కొనసాగుతుంది. మరోవైపు వెండిధర భారీగా తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 75వేలకు చేరుకుంది.
- దేశంలోని ప్రధాన నగరాల్లో..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రూ. 63,320 వద్దకు చేరింది.
ముంబయి, కోల్ కతా, బెంగళూరు నగరాల్లో .. 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 57,990 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,220 వద్ద కొనసాగుతుంది.
చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.58,390 కాగా, 24క్యారెట్ల గోల్డ్ రూ.63,710 వద్దకు చేరింది.
- తగ్గిన వెండి ధర ..
దేశవ్యాప్తంగా వెండి ధర తగ్గింది. కిలో వెండిపై రూ. వెయ్యి తగ్గుదల చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ. 75,000 గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,000కాగా.. ముంబయి, ఢిల్లీ, కోల్కతా ప్రాంతాల్లో కిలో వెండి రూ.73,500కు చేరింది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.71,000 వద్ద కొనసాగుతోంది.
- పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 6గంటలకు నమోదైనవి. బంగారం, వెండి ధరల్లో ఒకేరోజులో అనేకసార్లు మార్పులు చోటుచేసుకుంటాయి. దీనికితోడు ప్రాంతాల వారిగా గోల్డ్, సిల్వర్ ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలు చేసే సమయంలో ఆ సమయానికి ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేస్తే కచ్చితమైన ధర నిర్ధారణ చేసుకోవచ్చు.