PhonePeలో కొత్త ఫీచర్ : ఇక పేమెంట్ ఈజీ!

  • Published By: sreehari ,Published On : February 3, 2020 / 11:28 AM IST
PhonePeలో కొత్త ఫీచర్ : ఇక పేమెంట్ ఈజీ!

Updated On : February 3, 2020 / 11:28 AM IST

ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ PhonePe తమ వినియోగదారుల కోసం కొత్త chat ఫీచర్ ప్రవేశపెట్టింది. తమ ప్లాట్ ఫాంపై డిజిటల్ చెల్లింపులు జరిపే యూజర్ల కోసం ఫోన్ పే ఈ సౌలభ్యాన్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పటినుంచి నగదు రిక్వెస్ట్ చేయొచ్చు లేదా ఏ ఇతర మెసేజింగ్ యాప్ అవసరం లేకుండానే పేమెంట్ ధ్రువీకరించవచ్చు.

PhonePe చాట్ ఫీచర్.. యూజర్లు తమ కాంటాక్టుల్లోని వారికి ఈజీగా నగదు పంపుకోవచ్చు. ఒకవైపు చాటింగ్ చేస్తూనే అదే బాక్సులో ట్రాన్సాక్షన్ కూడా చేసుకోవచ్చు అని ఫోన్ పే సీటీఓ, సహా వ్యవస్థాపకుడు రాహుల్ చారీ ఒక ప్రకటనలో తెలిపారు.

యాప్ చాట్ ఫ్లోలో యూజర్ పేమెంట్ హిస్టరీ కనిపిస్తుందని అన్నారు. అంతేకాదు.. యూజర్లు తమ చాట్ హిస్టరీతో పాటు తమ ట్రాన్సాక్షన్లకు సంబంధించి సమాచారాన్ని కూడా ట్రాక్ చేసుకోవచ్చు అని రాహుల్ తెలిపారు. రానున్న వారాల్లో ఫోన్ పే యాప్ చాట్ ఫీచర్ ను గ్రూపు చాట్ లోకి డెవలప్ చేయనున్నట్టు చెప్పారు.

దీంతో గ్రూపులోని సభ్యులతో కూడా ఈజీగా మనీ రిక్వెస్ట్/కలెక్ట్ మనీ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చునని చారీ వెల్లడించారు. వారం క్రితమే ఆండ్రాయిడ్, iOS డివైజ్ ల కోసం ఫోన్ ఫే ఈ ఫీచర్ ను లాంచ్ చేసింది. కంపెనీ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఫోన్ పే యూజర్లు 185 మిలియన్లకు పైగా ఉన్నారు.