UNDP Report: దేశంలో మరింత పెరుగుతున్న ఆర్థిక అసమానతలు.. సగం సంపద 10% మంది దగ్గరే

UNDP Report: దీర్ఘకాలిక అభివృద్ధి సానుకూల మార్పులపై 2024 ఆసియా-పసిఫిక్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అనేక సూచనలు ఇచ్చింది. ఇదే సమయంలో ఆదాయం, సంపదలో పెరుగుతున్న అసమానత గురించి ఆందోళనలను కూడా పెంచుతోంది

UNDP Report: దేశంలో మరింత పెరుగుతున్న ఆర్థిక అసమానతలు.. సగం సంపద 10% మంది దగ్గరే

Updated On : November 6, 2023 / 9:27 PM IST

ఆర్థికంగా భారత్ తనదైన ముద్ర వేస్తూ ఆర్థిక పటిష్టంగా ఉన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. కానీ దేశంలో అంతర్గతంగా ఆందోళన కలిగించే పరిస్థితే ఉంది. దేశ ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయని యూఎన్‌డీపీ (యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్) నివేదిక తెలిపింది. అయితే ఈ నివేదికలో ఒక ఆశాజనకమైన విషయం వెల్లడైంది. మన దేశంలో అత్యంత పేదరికంలో నివసిస్తున్న వారి సంఖ్య తగ్గింది. 2015-16లో 25 శాతం ఉన్న ఈ సంఖ్య 2019-21 నాటికి 15 శాతానికి తగ్గిందని యూఎన్‌డీపీ పేర్కొంది.

ఇక ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే.. దేశంలో ధనవంతులైన 10 శాతం మంది వద్దే దేశ సంపద సగం ఉంది. 2.15 డాలర్లు అంటే 180 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉన్న 18.50 కోట్ల మంది ప్రజలు పేదరికంలో బతుకుతున్నారు. ఈ విషయమై యూఎన్‌డీపీ ఆసియా రీజినల్ డైరెక్టర్ కన్ని విఘ్నరాజా సోమవారం మాట్లాడుతూ.. ప్రస్తుత సవాళ్లను అధిగమించడానికి, మానవాభివృద్ధిలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని నివేదిక నొక్కి చెబుతుందని అన్నారు. అలాగే దీన్ని వాస్తవంలోకి తీసుకురావడానికి అన్ని దేశాలు తమ సొంత మార్గాన్ని సిద్ధం చేసుకోవాలని ఆయన సూచించారు.

ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో 10వేలు దాటిన మరణాలు, ఇందులో 4100 మంది పిల్లలే

దీర్ఘకాలిక అభివృద్ధి సానుకూల మార్పులపై 2024 ఆసియా-పసిఫిక్ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ అనేక సూచనలు ఇచ్చింది. ఇదే సమయంలో ఆదాయం, సంపదలో పెరుగుతున్న అసమానత గురించి ఆందోళనలను కూడా పెంచుతోంది. ఈ దిశలో ఖచ్చితమైన మార్పులు కనిపిస్తున్నాయి. 2000 నుంచి 2022 మధ్య మన దేశంలో తలసరి ఆదాయం 442 డాలర్ల నుంచి 2389 డాలర్లకి పెరిగింది. అదే సమయంలో 2004 నుంచి 2019 మధ్య దారిద్య్రరేఖకు దిగువనున్న వారి సంఖ్య 40 శాతం నుంచి 10 శాతానికి తగ్గింది.

నివేదిక ప్రకారం.. మొత్తం కార్మిక శక్తిలో మహిళల వాటా 23 శాతం మాత్రమే ఉంది. వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి. 2000 నుంచి ఆదాయ అసమానతలకు అనేక ఆధారాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. రోజుకు 12 నుంచి 120 డాలర్లు సంపాదిస్తున్న మధ్యతరగతి జనాభా భారతదేశంలో చాలా పెరిగింది. అలాగే ఈ విషయంలో మన దేశంలో ఉన్నవారికి పెద్ద ఎత్తున సహకారం అందుతోంది. నివేదిక ప్రకారం.. ప్రపంచ మధ్యతరగతిలో భారత్ 24 శాతం వాటాను కలిగి ఉంది. ఇది 19.2 కోట్ల జనాభాకు సమానం.

ఇది కూడా చదవండి: పోలింగ్‭కు ముందు ఉన్మాదానికి దిగిన నక్సలైట్లు.. IED పేలడంతో ఒక జవాను, ఇద్దరు పోలింగ్ సిబ్బంది మృతి