వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

  • Published By: murthy ,Published On : September 2, 2020 / 07:39 AM IST
వరంగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

Updated On : September 2, 2020 / 10:29 AM IST

వరంగల్ రూరల్‌ జిల్లాలో ఈ తెల్లవారు ఝూమున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారును ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు మరణించారు. బుధవారం తెల్లవారుజామున దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్ద లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టించాడు. దీంతో కారు నుజ్జునుజ్జయింది.


https://10tv.in/kadapa-dist-pulivendula-si-pulivendula-si-gopinath-reddy-fight-against-liquor-mafia/

కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడి కక్కడే మరణించారు. కాగా మృతులంతా 22 నుంచి 26 సంవత్సరాల మధ్య వయస్సు కలవారు కావటం గమనార్హం. మరణించిన వారు మేకల ప్రవీణ్‌, మేకల రాజేష్‌, మేడి పవన్‌, రోహిత్‌, రహీంలుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.