పసివాడు ఏం పాపం చేశాడు : భార్యపై అనుమానంతో 8నెలల కొడుకు హత్య

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి

  • Published By: veegamteam ,Published On : November 9, 2019 / 11:46 AM IST
పసివాడు ఏం పాపం చేశాడు : భార్యపై అనుమానంతో 8నెలల కొడుకు హత్య

Updated On : November 9, 2019 / 11:46 AM IST

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి

ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో భర్త కసాయిలా మారాడు. 8 నెలల కొడుకును నేలకేసి కొట్టి చంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమెను రోకలిబండతో కొట్టాడు.

ఈ దాడిలో భార్య రమాదేవికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త చిన్నపుల్లయ్య.. గతంలో మొదటి భార్యను అత్యంత దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమెను చంపిన కేసులో 8ఏళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నపుల్లయ్య పరారీలో ఉన్నాడని అతడి కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. 

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేశారు. పసివాడిని చంపడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ చిన్నారి ఏ పాపం చేశాడని కన్నీరుమున్నీరుగా విలపించారు.