కూతురిని ప్రియుడి దగ్గరికి పంపిన తల్లి : విజయవాడలో దారుణం
మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.

మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది.
మానవత్వం మంటగలిసింది. ఓ తల్లి సభ్యసమాజం తలదించుకునే పనిచేసింది. కూతుర్ని తన ప్రియుడి దగ్గరికి పంపించింది. ఈ దారుణమైన ఘటన కృష్ణా జిల్లా పరిటాలలో జరిగింది.
14ఏళ్ల కూతుర్ని 56 ఏళ్ల వయసున్న తన ప్రియుడి దగ్గరికి పంపించింది. తల్లి ఎదురుగా కూతుర్ని చిత్రహింసలు పెట్టాడు ఆ దుర్మార్గుడు. అయినా తల్లి కనికరించలేదు కూతుర్ని బలవంతంగా ప్రియుడి దగ్గరకు చేర్చింది.
తండ్రి చనిపోవడంతో ఆ బాలిక తన నానమ్మకు విషయాన్ని చెప్పింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.