బుర్జ్ ఖలీఫా నుంచి నయాగరా వరకు త్రివర్ణ శోభితం

  • Published By: venkaiahnaidu ,Published On : August 16, 2020 / 06:45 PM IST
బుర్జ్ ఖలీఫా నుంచి నయాగరా వరకు త్రివర్ణ శోభితం

Updated On : August 17, 2020 / 10:23 AM IST

కేవలం భారత్ లోనే కాకుండా 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మిన్నంటాయి. 74వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను పురాకరించుకొని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక కేంద్రాలు కూడా త్రివర్ణ శోభితంతో ముస్తాబయ్యాయి.



నయాగరా జలపాతం నుంచి బుర్జ్ ఖలీఫా వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు భారత త్రివర్ణ పతాక రంగుల్లో మెరిసిపోయాయి. భారత 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కెనడా ప్రభుత్వం నయాగరా జలపాతాన్ని భారత పతాకంలోని త్రివర్ణంతో అలరించింది.

అలా శనివారంనాడు పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్న భారత్‌కు తనదైన సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ ఫోటోలను కెనడా రాజధాని టొరాంటోలోని భారత కాన్సులేట్ షేర్ చేసింది. న్యూయార్క్ లోని ఎంపైర్ స్టేట్ భవనం మూడు రంగుల్లో కళకళలాడింది.



వేడుకల్లో భాగంగా వివిధ దేశాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ఫోటోలు,వీడియోలను అక్కడి భారత రాయబార కార్యాలయ అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.