New IT Rules : ఐటీ రూల్స్ పై “స్టే”కి నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.

Court
Delhi High Court Refuses To Stay New IT Rules: డిజిటల్ న్యూస్ మీడియాను నియంత్రించేలా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలని పలు మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు..స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. దీనిపై పిటిషనర్ వాదనతో ఏకీభవించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది.
కాగా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్)రూల్స్,2021ని పాటించాలంటూ..ది వైర్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెట్, ఆల్ట్ న్యూస్ మాతృసంస్థ ప్రవ్ధ మీడియా ఫౌండేషన్,ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజంకి కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించకుంటే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలంటూ ఈ న్యూస్ పోర్టల్స్.. ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించాయి. దీనిపై వాదనలు విన్న జస్టిస్ సీ. హరి శంకర్, జస్టిస్ సుబ్రహ్మణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం.. నోటిఫికేషన్ అమలు చేయాలని మాత్రమే కేంద్రం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది.
మీ వాదనతో మేము ఏకీభవించలేము…మీకు కావాలంటే సహేతుకమైన, వివరణాత్మకమైన ఉత్తర్వులు జారీ చేస్తాము…లేదంటే పిటిషన్ను రోస్టర్ బెంచ్కు నోటిఫై చేస్తాం…నోటీసుల్లో ఉన్న విషయాలను పూర్తిగా పరిశీలించి తిరిగి మాకు తెలియజేయండి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం పిటిషనర్ల అభ్యర్థన మేరకు దీనిపై విచారణను ఢిల్లీ హైకోర్టు జులై 7కు వాయిదా వేసింది..