యానిమేటెడ్ వర్షన్ లో మహర్షి టీజర్!

మహేశ్ బాబు కొత్త చిత్రం మహర్షి టీజర్ యూట్యూబ్ లో భారీ అంచనాల మధ్య దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మహర్షి’ మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు మహేష్ ఫ్యాన్స్ కొందరు ఈ టీజర్ కు యానిమేటెడ్ వర్షన్ ను రూపొందించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈ యానిమేటెడ్ టీజర్ పై స్పందించిన మహర్షి చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి యానిమేటెడ్ వెర్షన్ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. మీరు ప్రతీ సినిమాను మాకు ప్రత్యేకంగా మార్చేస్తున్నారు. మీకు రుణపడి ఉంటాం, ఈ వీడియో రూపొందించిన మహేష్ ఫ్యాన్స్ కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. అల్లరి నరేష్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.