మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో ‘అతడు’, ‘ఖలేజా’ వంటి సినిమాలు వచ్చాయి. ‘అతడు’ సక్సెస్ అయినప్పటికీ ‘ఖలేజా’ మాత్రం నిరాశపరిచింది. కానీ మహేష్ లో కామెడీ యాంగిల్ అతడి ఫ్యాన్స్ కి బాగా నచ్చింది.
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. అయితే అది సినిమా కోసం కాదు.. మహేష్ బాబుని పెట్టి ఓ యాడ్ ఫిల్మ్ ని షూట్ చేయబోతున్నాడు త్రివిక్రమ్. ఇదొక యాప్ కి సంబంధించిన యాడ్ గా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఓ పక్క అల్లు అర్జున్ ప్రాజెక్ట్ మీద పని చేస్తున్నప్పటికీ ఇది మంచి డీల్ కావడంతో రెండు రోజులు గ్యాప్ ఇచ్చి యాడ్ ఫిల్మ్ షూట్ చేయడానికి రెడీ అయ్యాడు త్రివిక్రమ్.
తాజాగా మరోసారి త్రివిక్రమ్తో కలిసి పనిచేయటంపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు మహేష్. ‘నా ఫేవరెట్తో మరోసారి.. ఈ అనుభవం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.