ఫస్ట్ షార్ట్ ఫిలింస్ చేసి.. డైరెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తాను
కొత్తదనం ఉండే సబ్జెక్ట్లను ఎంచుకుంటూ సినిమాలు తీసుకుంటూ పోతుంది హీరోయిన్ నివేదా థామస్. సెలక్టివ్గా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు లేటెస్ట్గా నటించిన సినిమా ‘వి’. నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, అదితిరావు హైదరిలతో కలిసి నివేదా థామస్ ఈ సినిమాలో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో సెప్టెంబర్ 5వ తేదీన విడుదల కాబోతుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా వెబినార్లో మీడియాతో మాట్లాడిన నివేదా థామస్.. కెరీర్ ఆరంభం నుంచి కథల ఎంపికలో కొత్తదనం ఎలా? అనే ప్రశ్నకు.. నాకు పలానా స్క్రిప్ట్స్ వినాలి, వినకూడదు అనే ఆలోచనైతే లేదు. దాదాపు నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ను తప్పకుండా వింటాను. వినే సమయంలో నేను ఈ పాత్రకు ఎలా న్యాయం చేస్తాను? అని ఆలోచించి సినిమా తీస్తాను అని ఆమె చెప్పారు.
స్టార్డమ్ గురించి ఆలోచించకుండా సినిమా ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంటే చాలు అని భావిస్తానన్నారు. ఇదే సమయంలో సినిమా దర్శకత్వంపై ఆసక్తి ఉన్నట్లుగా ఆమె చెప్పారు. తొలుత షార్ట్ ఫిలింస్ చేసి..ఆ తర్వాత డైరెక్షన్ కోసం ప్రయత్నాలు చేస్తానని అన్నారు. ప్రస్తుతానికి నేను నటిని మాత్రమే కాబట్టి తనకు ఎవరూ డైరెక్షన్ ఛాన్స్ ఇవ్వరు. నేను అవకాశం కోసం వెళ్లాలి. షార్ట్ ఫిలింస్ నిర్మాతలకు చూపించి సినిమా డైరెక్ట్ చేస్తానని అన్నారు.