2 వేల మంది టీవీ ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ ను ఆదుకున్న తలసాని ట్రస్ట్

కరోనా లాక్ డౌన్ కారణంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో షూటింగ్స్ నిలిపివేసిన సంగతి తెలిసిందే…. ఈ తరుణంలో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది టీవీ కళాకారులు, టెక్నీషియన్స్ ను ఆయా టీవీ సంఘాలు ,దాతలు ఆదుకోవడం జరిగింది. ఇటీవల సినీ పరిశ్రమలోని ఇబ్బందులను స్వయంగా తెలుసుకునేందుకు ఇండ్రస్ట్రీ పెద్దలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్.
టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వినోద్ బాల, సెక్రటరీ విజయ్ యాదవ్, టివి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ప్రసాద్, కెమెరా అసోసియేషన్ సెక్రటరీ నర్సింగ్ రావుతో సహా పలు సంఘాల నాయకులు మంత్రిని కలిసి టీవీ పరిశ్రమ సమస్యలను వివరించారు. టీవీ ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించేందుకు సుముఖత వ్యక్తం చేసిన మంత్రి తలసాని తన “తలసాని ట్రస్ట్” ద్వారా 2 వేల మంది టీవీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందచేయడం జరిగింది.
మంత్రి తలసాని ఇచ్చిన నిత్యావసర వస్తువులను అన్ని సంఘాల నాయకుల సమక్షంలో మే 31న హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో టీవీ కళాకారులకు పంపిణీ చేయడం జరిగింది.. సహాయం పొందిన కార్మికులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలుపుగా.. టివి పరిశ్రమ అభివృద్ధికి మరింతగా తోడ్పాడాలని నాయకులు కోరారు.