బ్రేకింగ్ : జమ్మూకశ్మీర్,లఢఖ్ కు కొత్త గవర్నర్లు నియామకం

జమ్మూకశ్మీర్,లఢఖ్ లకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. జమ్మూకశ్మీర్ కొత్త లెఫ్టెనెంట్ గవర్నర్గా 1985 IAS బ్యాచ్ గుజరాత్ కేడర్ కు చెందిన ఒడిషా IAS ఆఫీసర్ గిరీశ్ చంద్ర ముర్మూను నియమించారు. ప్రస్తుత జమ్మూకశ్మీర్ లెఫ్టెనెంట్ గవర్నర్ శ్రీ సత్యపాల్ మాలిక్ ను గోవాకు బదిలీ చేశారు. లఢఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా శ్రీ రాధాకృష్ణ మథుర్ ని నియమించారు. మిజోరాంమ్కు గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లైని నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.
జమ్మూకశ్మీర్ కు కొత్త గవర్నర్ గా నియమితులైన గిరీశ్ చంద్ర ముర్మూ… ప్రధానమంత్రి నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. లడఖ్ లెఫ్టెనెంట్ గవర్నర్ గా నియమితులైన రాధాకృష్ణ మథుర్.. త్రిపుర కేడర్ కు చెందిన 1977 బ్యాచ్ IAS ఆఫీసర్. త్రిపుర చీఫ్ సెక్రటరీగా మథుర్ పనిచేశారు. ఢిఫెన్స్ సెక్రటరీగా కూడా ఆయన పనిచేశారు. 2018లో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CIC)నుంచి రిటైర్ట్ అయ్యారు.
ఈ ఏడాది ఆగస్టు-5,2019న జమ్మూకశ్మీర్ కు ప్రత్యేకప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రప్రభుత్వం రద్దు చేసిన విసయం తెలిసిందే. జమ్మూకశ్మీర్ ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా,లఢఖ్ ను అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా పునర్విభజన చేశారు. అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్,లఢఖ్ ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాలుగా అధికారంగా అమలులోకి వస్తాయి.