దేశంలో తొలిసారి: ఒక రోజులో మిలియన్ కరోనా పరీక్షలు

  • Published By: vamsi ,Published On : August 23, 2020 / 07:45 AM IST
దేశంలో తొలిసారి: ఒక రోజులో మిలియన్ కరోనా పరీక్షలు

Updated On : August 23, 2020 / 8:12 AM IST

రోజువారీ కోవిడ్ -19 పరీక్షలను పెంచే నిబద్ధతతో, ఒకే రోజులో 10 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించే క్లిష్టమైన స్థాయిని దాటింది భారతదేశం. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3.4 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించగా.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం పరీక్షల్లో భారీగా పెరుగుదల కనిపించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

పెద్ద సంఖ్యలో పరిశోధనల కారణంగా సంక్రమణ కేసుల రేటు మొదట్లో పెరుగుతుంది, కానీ, క్వారంటైన్‌లో ఉండడం, రోగులను సమర్థవంతంగా పర్యవేక్షించడం మరియు సకాలంలో సమర్థవంతమైన చికిత్స వంటి ఇతర చర్యలు చివరికి కరోనాని తగ్గిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది.

శనివారం(22 ఆగస్ట్ 2020) మొత్తం 10,23,836 నమూనాలను పరీక్షించామని, వాటిలో సుమారు 3.8 లక్షల నమూనాలను వేగంగా యాంటిజెన్ పద్ధతిలో పరీక్షించామని అరోగ్యవర్గాలు తెలిపాయి. దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,44,91,073 నమూనాలను పరీక్షించామని, వాటిలో 28 శాతం కేసులను వేగవంతమైన యాంటిజెన్ పద్ధతిని ఉపయోగించి పరీక్షించినట్లు చెప్పారు.

పరిశోధనాత్మక ప్రయోగశాలల నెట్‌వర్క్ విస్తరణ వల్ల కూడా ఈ ఘనత సాధించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పుడు దేశంలో 1,511 ల్యాబ్‌లు ఉన్నాయి, వీటిలో 983 ప్రభుత్వ రంగంలో ఉన్నాయి మరియు 528 ప్రైవేట్‌గా ఉన్నాయి.