కొంపముంచిన కనికా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కరోనా పరీక్షలు..?

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా

  • Published By: veegamteam ,Published On : March 21, 2020 / 04:08 AM IST
కొంపముంచిన కనికా, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కరోనా పరీక్షలు..?

Updated On : March 21, 2020 / 4:08 AM IST

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కరోనా సోకిన బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ను కలిసిన బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్, రాష్ట్రపతిని కూడా కలిశారు. కనికా కపూర్ కి పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ అయ్యారు. కనికా కపూర్ ను కలిసిన తర్వాత ఎంపీ దుష్యంత్ సింగ్ రాష్ట్రపతిని కూడా కలిశారు. దీంతో రాష్ట్రపతి రామ్ నాథ్ అలర్ట్ అయ్యారు. తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. ఆయన కరోనా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని, స్వీయ నిర్బంధం(సెల్ఫ్ క్వారంటైన్) కానున్నారని తెలుస్తోంది.

బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆమె తీరుపై యూపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. కనికా కపూర్ మార్చి 15న యూకే నుంచి వచ్చింది. ఆ తర్వాత లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు విందు ఇచ్చింది. ఆ తర్వాత కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో అంతా షాక్ తిన్నారు. కనికా కపూర్ తన విదేశీ ప్రయాణ వివరాలను దాచి పెట్టినందుకు యూపీ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైనా వెంటనే 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ కావాలని కేంద్రం ఆదేశించింది. విదేశీ ప్రయాణ వివరాలను ప్రభుత్వానికి అందించాలి. ఇది తప్పనిసరి. అయితే కనికా కపూర్ మాత్రం రూల్స్ బ్రేక్ చేసింది. విదేశీ ప్రయాణ వివరాలు దాచిపెట్టడమే కాకుండా, సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్భంధం) కూడా కాలేదు. దీన్ని యూపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఆమెపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అలాగే కనికా కపూర్ ఇచ్చిన పార్టీకి హాజరైన వారి వివరాలను, కనికాను కలిసిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. కనికాకు కరోనా అని తేలడంతో ఆమెను కలిసిన వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

See Also |  విశాఖలో కరోనా పాజిటివ్ : అల్లిపురంలో రహదారుల మూసివేత

యూకే నుంచి వచ్చాక కనికా కపూర్ లక్నోలో ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు విందు ఇచ్చింది. దీనికి రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు, బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌, పలువురు ప్రముఖులు, బ్యూరోక్రాట్లు, సెలబ్రిటీలు హాజరయ్యారు. పార్టీకి హాజరైన ప్రముఖులతో కనికా సెల్ఫీలు తీసుకున్నారు. షేక్ హ్యాండ్ లు ఇచ్చారు. ఆ పార్టీకి హాజరైన మరుసటి రోజు ఎంపీ దుష్యంత్ సింగ్ పార్లమెంటు సెంట్రల్‌ హాల్ లో ఎంపీ నిశికాంత్, మనోజ్ తివారీతో భేటీ అయ్యి ముచ్చటించారు. ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. కనికాకు పాజిటివ్ అని తేలడంతో ఎంపీ దుష్యంత్ సింగ్, వసుంధరా రాజే ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం)లోకి వెళ్లిపోయారు. సింగర్‌ కు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కనికా ఇచ్చిన పార్టీకి హాజరైన వారందరూ స్వయంగా క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలని, ఏవైనా కరోనా లక్షణాలుంటే వెంటనే తమకు తెలియజేయాలని సూచించారు.