Central Govt : రెచ్చగొట్టే, తప్పుడు వార్తలు ప్రసారం చేయొద్దు.. టీవీ చానళ్లపై కేంద్రం సీరియస్
ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపింది.
central government : దేశంలోని పలు టీవీ చానళ్లపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రెచ్చగొట్టే వార్తలు, తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కేంద్ర సమాచార శాఖ హెచ్చరించింది. కేబుల్ నెట్ వర్క్ టెలివిజన్ చట్టం, ప్రోగ్రాం కోడ్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై తప్పుడు వార్తలు ప్రసారం చేయడం వల్ల దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఢిల్లీ అల్లర్ల పైన రెచ్చగొట్టే హెడ్డింగ్ లు, వార్తలు, చర్చలు ప్రసారం చేశారని పేర్కొంది. ఇలాంటి వార్తల వల్ల సమాజంలో సామరస్య వాతావరణం దెబ్బతింటొందని తెలిపింది. ఈమేరకు పలు చానళ్ళకు కేంద్ర సమాచార శాఖ అడ్వయిజరీ నోటీసులు పంపింది.
ప్రైవేట్ టీవీ చానళ్ల ధోరణిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జహంగిర్పూర్ ప్రాంతంలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణలు, ఉక్రెయిన్పై రష్యా దాడికి సంబంధించి కొన్ని టీవీ ఛానెల్స్ చేసిన ప్రసారాలపై కేంద్రం అభ్యంతరం తెలిపింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రెచ్చగొట్టేలా హెడ్లైన్లు, వ్యాఖ్యలు చేసిన కొన్ని టీవీ చానళ్లకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురకలు అంటించింది. నియమ, నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్న అలాంటి ప్రసారాలను మానుకోవాలని హితవు పలికింది.
Youtube Channels : 22 యూ ట్యూబ్ చానళ్ళను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
ఇటీవల అనేక శాటిలైట్ టీవీ చానళ్లు వార్తా సంఘటనలను అశాస్త్రీయంగా, తప్పుదోవపట్టించేవిగా, సంచలనాత్మకంగా కవరేజీని ప్రసారం చేసినట్లుగా గుర్తించామని వెల్లడించింది. సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, వ్యాఖ్యలను ఉపయోగించడం, ఇతరుల మర్యాదను కించపరచడం, అసభ్యకరంగా, పరువు నష్టం కలిగించేలా, మతపరమైన వ్యక్తీకరణలు వంటివి ప్రోగ్రామ్ కోడ్తోపాటు ది కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ (నియంత్రణ) చట్టం 1995 సెక్షన్ 20లోని సబ్ సెక్షన్ (2) నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తున్నాయని పేర్కొంది.
హనుమాన్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని జహంగీర్పురిలో ఇటీవల జరిగిన మత ఘర్షణలపై టీవీ ఛానళ్ల కవరేజీని కేంద్రం ఈ మేరకు ఉదాహరించింది. ప్రజలను రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, వర్గాల మధ్య విభేదాలు సృష్టించేలా ఉన్న హెడ్లైన్స్, వ్యాఖ్యలు, హింసాత్మక వీడియోలు, సామాజికంగా ఆమోదయోగ్యం కాని భాష, మతపరమైన వ్యాఖ్యలు, సంబంధిత అంశాలపై టీవీ ఛానళ్లలో చర్చలపై అభ్యంతరం తెలిపింది. ఇలాంటివి వీక్షకులపై ప్రతికూల మానసిక ప్రభావాన్ని చూపుతాయని పేర్కొంది. మత సామరస్యాన్ని ప్రేరేపిస్తాయని, శాంతికి విఘాతం కలిగిస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.
Central Government : సీబీఐ, ఈడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
టీవీ ఛానళ్లపై ప్రసారమైన రష్యా యుక్రెయిన్ యుద్ధం కవరేజీపైనా కేంద్ర ప్రభుత్వం విమర్శలు చేసింది. కొన్ని ఛానెల్స్ తప్పుడు వాదనలు చేస్తున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ఏజెన్సీలు, ప్రముఖులను తప్పుగా ఉటంకించడం గమనించామని చెప్పింది. వార్తాంశాలతో పూర్తిగా సంబంధం లేని ‘స్కాండలస్ హెడ్లైన్లు, ట్యాగ్లైన్లను’ ఉపయోగిస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది. చాలా మంది జర్నలిస్టులు, టీవీ యాంకర్లు వీక్షకులను రెచ్చగొట్టేలా కల్పితంగా, అతిశయోక్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించింది. సంబంధిత నియమ, నిబంధనలు ఉల్లంఘించే విధంగా ఉన్న వీటిని మానుకోవాలని సూచించింది.