India-China : నేడు భారత్ – చైనా సైనికుల మధ్య మరోసారి చర్చలు
ఇంతకుముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. ఇవాళ జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్చోక్ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవాలని చైనాపై భారత్ ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది.

India China
India-China : తూర్పు లద్దాఖ్లో కొనసాగుతున్న సరిహద్దు ప్రతిష్టంభన నేపథ్యంలో మరోసారి చర్చలకు సిద్ధమయ్యాయి ఇరు దేశాలు. ఇవాళ 16వ రౌండ్ సైనిక చర్చలు జరుగనున్నాయి. ఈసారి చర్చలు వాస్తవాధీన రేఖ వెంట భారత్ వైపున జరుగుతాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి సరిహద్దు వెంట శాంతి, ప్రశాంతత అవసరమని నొక్కి చెబుతూనే… తూర్పు లద్దాఖ్లోని మిగతా అన్ని పాయింట్ల నుంచి దళాలను ఉపసంహరించాలని చైనాపై భారత్ ఒత్తిడి తెస్తున్నది.
ఇంతకుముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. ఇవాళ జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్చోక్ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవాలని చైనాపై భారత్ ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది.
S Jaishankar: భారత విద్యార్థుల్ని అనుమతించండి.. చైనా మంత్రిని కోరిన భారత్
గతవారం బాలిలో జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సమావేశమయ్యారు. త్వరగా తూర్పు లద్దాఖ్ పరిస్థితుల పరిష్కారంపై చర్చించారు. 2020, మే5న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది.
ఆ తర్వాత భారత్, చైనా మధ్య సరిహద్దుపై ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత ఇరుదేశాలు భారీగా సైనికులు, ఆయుధాలను మోహరించాయి. సైనిక, దౌత్యపరమైన చర్చల తర్వాత గతేడాది పలు ప్రాంతాల నుంచి సైనికులను వెనక్కి పిలిచాయి.