ఇక పోటీ చేయను : ఇవే నా చివరి ఎన్నికలు 

  • Published By: veegamteam ,Published On : April 4, 2019 / 05:10 AM IST
ఇక పోటీ చేయను : ఇవే నా చివరి ఎన్నికలు 

Updated On : April 4, 2019 / 5:10 AM IST

ముంబై : రానున్న  ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుశిల్‌ కుమార్‌ షిండే తెలిపారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేతలు ఇప్పటికే పలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పాలనలో పాలుపంచుకున్నారు. కాగా ఎవ్వరైనా..ఏనాటికైనా ఆయా రంగాలలో ఎంతటి ప్రతిభ కనబరిచినా దాని నుంచి తప్పుకోవాల్సిందే. ఈ క్రమంలో షాయాజీ షిండే మహారాష్ట్రలోని షోలాపూర్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతు..‘ఇవే నా చివరి ఎన్నికలని ఇక ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆశీస్సులు నాకు ఎప్పుడూ ఉండాలని తెలిపారు. కాగా ఈ లోక్ సభ ఎన్నికల్లో షిండే బీజేపీ నేత జైసిద్దేశ్వర్‌ స్వామి, అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌తో పోటీ పడుతున్నారు. 

షిండే రాజకీయ ప్రస్తానం 
1970ల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన షిండే..1974లో షోలాపూర్‌ జిల్లాలోని కర్మాలా అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీ చేశారు. ఆనాటి సీఎం వసంతరావ్‌ నాయక్‌ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1978లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన షిండే..శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌లో చేరారు. అనంతరం కొంత కాలానికే తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2003లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గానూ వ్యవహరించారు. యూపీఏ హయాంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు.