బీహార్ లో రెండో దశ పోలింగ్ ప్రారంభం
second phase of Bihar Assembly polls బీహార్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ ఇవాళ(నవంబర్-3,2020)ప్రారంభమైంది. మొత్తం 3దశల్లో జరుగనున్న పోలింగ్ లో ఇవాళ రెండో దశలో భాగంగా 17జిల్లాల్లోని 94 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. భారీ సెక్యూరిటీ,కరోనా గైడ్ లైన్స్ మధ్య పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ బూత్ ల దగ్గర ఓటర్లు సామాజిక దూరం పాటిస్తున్నారు.
ఆర్జేడీ నాయకుడు మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ తో సహా మొత్తం 1463మంది రెండో దశ పోలింగ్ బరిలో నిలిచారు.
https://10tv.in/bihar-153-crorepatis-in-first-phase-poll-fray/
కాగా, మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి 3దశల్లో ఎన్నికలు జరుగుతుండగా…అక్టోబర్-28,2020న తొలి దశలో భాగంగా 16జిల్లాల్లోని 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇవాళ(నవంబర్-3) రెండో దశలో భాగంగా 94స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. మిగిలిన 78స్థానాలకు నవంబర్-7న పోలింగ్ జరుగనుంది. నవంబర్-10న ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి.
ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఇతర చిన్న పార్టీలు కలిసి పోటీచేస్తుండగా..ఆర్జేడీ-కాంగ్రెస్-మూడు లెఫ్ట్ పార్టీలు కూటమిగా పోటీచేస్తున్నాయి. ఇక,కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి అయినప్పటికీ బీహార్ ఎన్నికల్లో లోక్ జనశక్తి పార్టీ(LJP)స్వతంత్రంగా పోటీ చేస్తోంది.
Voting begins for the second phase of Bihar Assembly polls. 1463 candidates, including RJD leaders Tejashwi Yadav and Tej Pratap Yadav, in fray for 94 seats across 17 districts.#BiharElections pic.twitter.com/qomEOAwgOH
— ANI (@ANI) November 3, 2020