బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం.

  • Published By: chvmurthy ,Published On : March 4, 2019 / 10:31 AM IST
బీహార్ లో 40 సీట్లు గెలుస్తాం : మోడీని ప్రధానిని చేస్తాం.

Updated On : March 4, 2019 / 10:31 AM IST

పాట్నా : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లోని 40 స్థానాల్లో  గెలిచి మోడీని  ప్రధానమంత్రిని  చేస్తామని, ఈ విషయంలో ప్రధాని మోదీకి హామీ ఇస్తున్నానని ఆయన తెలిపారు.  తద్వారా మళ్లీ ఎన్డీఏను అధికారంలోకి వచ్చి మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆయన అన్నారు.  
Also Read : అభినందన్ అరుదైన రికార్డ్ : F-16 కూల్చిన తొలి IAF కమాండర్

పాట్నాలోని గాంధీ మైదానంలో  ఆదివారం నిర్వహించిన సంకల్ప్‌ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు సీఎం నితీష్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్న ప్రధాని మోదీని నితీష్‌ కొనియాడారు. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌, ఆర్మీ చర్యలను నితీష్‌ ప్రశంసించారు. 
Also Read : అభినందన్ తరహా మీసం, హెయిర్ స్టైల్ పై యువత ఉత్సాహం