9/11 Terror Attack : 20ఏళ్ల తర్వాత.. ఎప్పటికీ మర్చిపోలేని 9/11 దాడుల భయానక దృశ్యాలు!
అదో భయానక ఘటన.. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. 20 సంవత్సరాల క్రితం.. సెప్టెంబర్ 11, 2001న 9/11 దాడుల నాటి ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది.

రెండో టవర్, సెప్టెంబర్ 11, 2001 నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. శిధిలాల్లో నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలోని ఒకదాని నుంచి పొగలు కమ్ముకున్నాయి.
September 11 Terror Attacks : అదో భయానక ఘటన.. తలచుకుంటే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం.. ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలు.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్, వాషింగ్టన్, డిసిలోని పెంటగాన్, పెన్సిల్వేనియాలోని శాంక్విల్లేలో ట్విన్ టవర్లలోకి దూసుకెళ్లాయి. సెప్టెంబర్ 11, 2001న జరిగిన ఈ ఉగ్రదాడుల ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది. అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై 9/11 ఉగ్రదాడి జరిగి శనివారం (సెప్టెంబర్-11,2021)నాటికి 20 ఏళ్లు పూర్తవుతుంది. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లతో సహా దాదాపు 3వేల మంది ఈ ఉగ్రదాడుల్లో మరణించారు. 9/11 ఆ దాడుల నాటి కొన్ని చిరస్మరణీయ ఫొటోలు మీకోసం అందిస్తున్నాం..
- ట్విన్ టవర్స్పై ఉగ్రదాడి తరువాత న్యూయార్క్లో పొగ కమ్మేసింది. ఉగ్రదాడిలో దాదాపు 3,000 మంది మరణించారు. లెక్కలేనన్ని మంది గాయపడ్డారు. ఇది యునైటెడ్ స్టేట్స్ను శాశ్వతంగా మార్చింది.
- మాన్హాటన్లోని పాదచారులకు మంగళవారం, సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి వచ్చే పొగ చూస్తున్నారు. ఈ సంఘటన దేశంలోని సుదీర్ఘ యుద్ధానికి నాంది పలికింది. అఫ్ఘానిస్తాన్కు అమెరికా బలగాలను వేగంగా మోహరించేలా చేసింది.
- సెప్టెంబర్ 11, 2001 (మంగళవారం)నాడు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్ నుంచి మంటలు, పొగలు ఎగసిపడుతున్న దృశ్యం.
- సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు గాల్లో ధూళితో ప్రజలు తమ ముఖాలను ఇలా కప్పుకున్నారు.
- న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెప్టెంబర్ 11, 2001 కూలిపోయిన తర్వాత బ్రూక్లిన్ నుంచి చూసినట్లుగా మాన్హాటన్లోని భవనాల నుంచి పొగ కమ్ముతోంది.
- WTCపై దాడి జరిగిన అరగంటలోపు.. డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం బయలుదేరింది. ఇది పెంటగాన్ పశ్చిమ భాగంలో క్రాష్ అయింది. ఇక్కడ US స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఉంది.
- సెప్టెంబర్ 11, 2001న వాషింగ్టన్లో పెంటగాన్ వెలుపల పెంటగాన్ ఉద్యోగికి సాయుధ అధికారి ఓదార్చిన దృశ్యం
- వాషింగ్టన్లోని పెంటగాన్ వద్ద ఒక భవనం నుంచి మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. 9/11 దాడుల వెనుక సూత్రధారి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. కొద్దిసేపటి తర్వాత అమెరికా అఫ్ఘానిస్తాన్పై బాంబు దాడులు జరిపింది.
- ఉగ్రవాదుల దాడి తరువాత న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు టవర్లు కూలిపోయిన కొద్ది సేపటికే శిథిలాల నుంచి ఒకరిని భద్రతా బలగాలు రక్షించిన దృశ్యం.
- సెప్టెంబర్ 11, 2001, న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాలిపోతుండగా ఇద్దరు మహిళలు ఒకరినొకరు పట్టుకుని బోరున విలపిస్తున్నారు. ఆ రోజు ప్రపంచ వాణిజ్య కేంద్రం, పెంటగాన్ నుంచి 33వేల లేదా అంతకంటే ఎక్కువ మందిని ఖాళీ చేయించారు.
- ప్రపంచ వాణిజ్య కేంద్రం దక్షిణ టవర్ నుంచి సెప్టెంబర్ 11, 2001 రోజున ప్రజలు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యం.
- న్యూయార్క్, సెప్టెంబర్ 11, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న ప్రదేశంలో చెత్త కుప్పల మధ్య అగ్నిమాపక సిబ్బంది వెళ్తున్న దృశ్యం.
- రెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోవడంతో ప్రజలు న్యూయార్క్ బ్రూక్లిన్ వంతెనపై మాన్హాటన్ నుంచి బ్రూక్లిన్ వరకు నడిచి వెళ్తున్నారు.
- న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో సెప్టెంబర్ 11, 2001 సమీపంలో ప్రజలంతా భయంతో పరుగులు పెడుతున్న దృశ్యం.
- రెండో టవర్, సెప్టెంబర్ 11, 2001 నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. శిధిలాల్లో నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలోని ఒకదాని నుంచి పొగలు కమ్ముకున్నాయి.
- న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవశేషాలు శిథిలాల మధ్య ఒరిగిన స్థితిలో ఇలా కనిపిస్తున్నాయి.
- సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్ నుంచి ఒక వ్యక్తి బయటకి వస్తుండగా.. ఎడమవైపున భవనం నుంచి పొగ, మంటలు ఎగసిపడుతున్న దృశ్యం..
- న్యూయార్క్లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసమైన ములియన్స్, స్ట్రట్స్ కింద అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్న దృశ్యం.
- వరల్డ్ ట్రేడ్ సెంటర్పై 9/11 దాడుల నుంచి బయటపడిన వ్యక్తి.. న్యూయార్క్లో శుక్రవారం, ఆగస్టు 6, 2021, 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచిన చనిపోయిన వారి ఫొటోలను చూస్తున్న దృశ్యం.
- ఆగష్టు 26, 2021 రోజున న్యూయార్క్ నగరంలో 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో విద్యార్థి నివాళులు..
- 2021 ఆగస్టు 6 రోజున.. 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో అమెరికా, న్యూయార్క్ సిటీలో ఆనాటి ట్విన్ టవర్ల ఫోటోను ఓ వ్యక్తి ఇలా పట్టుకున్నాడు.
- అమెరికాలోని న్యూయార్క్ ట్విన్ టవర్స్(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై 9/11 ఉగ్రదాడి జరిగి శనివారం (సెప్టెంబర్-11,2021)నాటికి 20 ఏళ్లు పూర్తవుతుంది.
- శిథిలావస్థలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన 343 అగ్నిమాపక సిబ్బందిని కూడా న్యూయార్క్ అగ్నిమాపక శాఖ కోల్పోయింది.
- ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లతో సహా దాదాపు 3వేల మంది ఈ ఉగ్రదాడుల్లో మరణించారు. అమెరికా గడ్డపై అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచింది.
- 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ఆశ్రయం కల్పించిన అల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అఫ్ఘానిస్తాన్కు అమెరికా సైనికులను మోహరించారు.
- ఆ తర్వాత జరిగిన 20 సంవత్సరాల యుద్ధం ఆగస్ట్ 31న ముగిసింది. ఇప్పటి బైడెన్ పరిపాలనలో అప్ఘాన్ లో అమెరికా మొత్తం సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది.
- ట్విన్ టవర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో భయంతో అక్కడివారంతా బయటకు పరుగులు తీస్తున్న దృశ్యం.
అమెరికా గడ్డపై అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచింది. శిథిలావస్థలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన 343 అగ్నిమాపక సిబ్బందిని కూడా న్యూయార్క్ అగ్నిమాపక శాఖ కోల్పోయింది. 9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్.. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ఆశ్రయం కల్పించిన అల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అఫ్ఘానిస్తాన్కు అమెరికా సైనికులను మోహరించారు. ఆ తర్వాత జరిగిన 20 సంవత్సరాల యుద్ధం ఆగస్ట్ 31న ముగిసింది. ఇప్పటి బైడెన్ పరిపాలనలో అప్ఘాన్ లో అమెరికా మొత్తం సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది.