Bharat Jodo Yatra: కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర.. ఫొటో గ్యాలరీ

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మంగళవారం కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గలోని హర్థికోట్ నుంచి ప్రారంభమైంది. ఈ యాత్రలో రాహుల్ వెంట స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొన్న పలువురితో మాట్లాడుకుంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగారు. పలు ప్రాంతాల్లో ఆగి స్థానికుల సమస్యలను తెలుసుకున్నారు. పలువురు యువతీ,యువకులు, చిన్నారులు రాహుల్ తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. రాహుల్ యాత్రకు మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. ఐదు నెలల్లో 12 రాష్ట్రాల్లో భారత్ జోడో యాత్ర నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. సెప్టెంబర్ 30న కర్ణాటక రాష్ట్రంలో ప్రారంభమైన యాత్ర మరికొద్దిరోజులు అక్కడే సాగనుంది. అనంతరం తెలుగు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభమవుతుంది.

1/20Bharat Jodo Yatra
Bharat Jodo Yatra
2/20
Bharat Jodo Yatra (2)
3/20
Bharat Jodo Yatra (3)
4/20
Bharat Jodo Yatra (4)
5/20
Bharat Jodo Yatra (5)
6/20
Bharat Jodo Yatra (6)
7/20
Bharat Jodo Yatra (7)
8/20
Bharat Jodo Yatra (8)
9/20
Bharat Jodo Yatra (9)
10/20
Bharat Jodo Yatra (10)
11/20
Bharat Jodo Yatra (11)
12/20
Bharat Jodo Yatra (12)
13/20
Bharat Jodo Yatra (13)
14/20
Bharat Jodo Yatra (14)
15/20
Bharat Jodo Yatra (15)
16/20
Bharat Jodo Yatra (16)
17/20
Bharat Jodo Yatra (17)
18/20
Bharat Jodo Yatra (18)
19/20
Bharat Jodo Yatra (19)
20/20
Bharat jodo yatra