Mauni Amavasya 2025 : 29నే మౌని అమావాస్య.. శుభముహూర్తం, పూజా విధానం ఏంటి? ఏ మంత్రాలను జపిస్తే మంచిదంటే?

Mauni Amavasya : మౌని అమావాస్య 2025 రోజున పూర్వీకులకు తర్పణం అందించడం ద్వారా పితృ దోషం నుంచి ఉపశమనం పొందుతారు. పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి.

Mauni Amavasya 2025 : 29నే మౌని అమావాస్య.. శుభముహూర్తం, పూజా విధానం ఏంటి? ఏ మంత్రాలను జపిస్తే మంచిదంటే?

mauni amavasya 2025

Updated On : January 28, 2025 / 2:30 PM IST

Mauni Amavasya 2025 : హిందూపురాణాల ప్రకారం.. అమావాస్య అనేది పూర్వీకులకు అంకితం. పూర్వీకులు మోక్షాన్ని పొందడానికి ఆరోజున పవిత్ర నదులలో స్నానం చేయాలని చెబుతుంటారు. దానాలతో పాటు తర్పణం సమర్పించడం వంటి ఆచారాలను చేస్తారు. హిందూ మతంలో మౌని అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

ఈ పండుగను ప్రతి సంవత్సరం మాఘమాసంలో జరుపుకుంటారు. ఈ రోజున పూర్వీకులకు పిండదానం, తర్పణం సమర్పించే సంప్రదాయం ఉంది. ఈ సంవత్సరం మౌని అమావాస్య పండుగ జనవరి 29న రానుంది. ‘మౌని’ అంటే ‘నిశ్శబ్దం’ అని అర్థం. ఈ రోజున మౌనంగా ఉండటం, ధ్యానం చేయడం చేస్తుండాలి. ఈసారి త్రివేణి యోగంతో పాటు అనేక శుభ యోగాలు ఏర్పడడంతో మౌని అమావాస్య ప్రాధాన్యత అనేక రెట్లు పెరిగింది.

Read Also : Mauni Amavasya 2025 : మౌని అమావాస్య వచ్చేస్తుంది.. ఏం చేయాలి? ఏం చేయొద్దు.. ఏం ఫలం లభిస్తుంది.. ఫుల్ డిటెయిల్స్..

జీవితంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పిత్ర దోషం నుంచి ఉపశమనం పొందాలి. మౌని అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం పెడితే చాలా మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అలాగే ఈసారి మౌని అమావాస్య నాడు మహాకుంభానికి సంబంధించిన రెండో రాజ స్నానం కూడా జరగనుంది. దానం, స్నానం, పూజా విధానం, మంత్రాలను జపించడం, శుభ సమయాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మౌని అమావాస్య తిథి ఎప్పుడు? ఎంతకాలం ఉంటుంది :
హిందూ క్యాలెండర్ ప్రకారం.. మాఘ మాస అమావాస్య తిథి జనవరి 28న రాత్రి 7.32 గంటలకు ప్రారంభమై జనవరి 29న సాయంత్రం 6.05 గంటలకు ముగుస్తుంది.

మౌని అమావాస్య స్నానం, దానంకు అనుకూలమైన సమయాలివే :
29 జనవరి 2025 అమావాస్య తిథి, బ్రహ్మ ముహూర్తం ఉదయం 5.30 నుంచి 6.21 వరకు
29 జనవరి 2025 అమావాస్య తిథి లాభ చోఘడియ ఉదయం 7.11 గంటలకు
అమృత్ చోఘడియా : ఉదయం 8.31 నుండి 9.53 వరకు
11:13 నుండి 12:35 వరకు శుభ చోఘడియ.

అమృత స్నానానికి అనుకూలమైన సమయం :
హిందూ క్యాలెండర్ ప్రకారం.. జనవరి 29, 2025న అమృత స్నానానికి శుభసమయం ఉదయం 5.25 నుంచి 6.18 వరకు ఉంటుంది. ఆ తర్వాత ఉదయం, సాయంత్రం 5.51 గంటల నుంచి 7.11 గంటల వరకు ముహూర్తం ఉంటుంది. ఈ ముహూర్తంలో భక్తులు గంగాస్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది.

కలిగే శుభ యోగం ఏంటి? :
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఈ సంవత్సరం మౌని అమావాస్య నాడు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు మకరరాశిలో కలిసి త్రివేణి యోగాన్ని ఏర్పరుస్తారు.

మౌని అమావాస్య పూజా విధానం :
మౌని అమావాస్య రోజున గంగ లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేయాలి. మీరు ఏ నదిలోనైనా స్నానం చేయలేకపోతే ఇంట్లో గంగాజలం వేసి స్నానం చేయండి. ఆ తరువాత, పూజా వేదికపై పసుపు వస్త్రాన్ని పరచి.. విష్ణువు విగ్రహం లేదా ఫొటోను కూడా ప్రతిష్టించండి. ఆ ప్రతిమకు పసుపు రంగు వస్తువులు సమర్పించండి. విష్ణువు సహస్రానామాలను పఠించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపు కలిపిన నీళ్లను చల్లి ఇంటి డోర్ ఫ్రేమ్‌ను కూడా శుభ్రం చేసుకోవాలి.

Read Also : Venus Transit Malavya Yoga : ఇవాళ్టి నుంచే మీనరాశిలోకి శుక్రుడు.. ఇది మాలవ్య రాజయోగం.. ఈ మూడు రాశుల వారికి లక్కే లక్కు..!

ఈ మంత్రాలను జపించండి :
ఓం శ్రీ పిత్రాయై నమః
ఓం శ్రీ పిత్రిదేవాయ నమః
ఓం శ్రీ పితృభ్యః నమః
ఓం శ్రీ సర్వ పితృ దేవతాభయో నమో నమః
ఓం పితృగణాయ విద్మహే జగత్ ధారిణి ధీమహి
తన్నో పిత్రో ప్రచోదయాత్ ఓం దేవతాభ్య:
పితృభ్యశ్చ మహాయోగిభ్య చ. నమః:
స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః:
ఓం అద్య భూతాయ విద్మహే సర్వ సేవాయ ధీమహి
శివ-శక్తి స్వరూపేన్ పితృ దేవ్ ప్రచోదయాత్