ICC Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పై ఐసీసీ కీలక నిర్ణయం.. మంగళవారం బీసీసీఐ, పీసీబీలతో సమావేశం!
వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ఇంకా సందిగ్థత వీడడం లేదు.

ICC calls emergency meeting BCCI PCB Come together to slove Champions Trophy 2025 dead lock Report
ICC Champions Trophy 2025 : వచ్చే ఏడాది జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పై ఇంకా సందిగ్థత వీడడం లేదు. భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్లో పర్యటించలేమని బీసీసీఐ అంటుండగా.. మరోవైపు పాకిస్థాన్ ఎట్టి పరిస్థితుల్లో టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ను ప్రకటించాల్సి ఉన్నా ఐసీసీ వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
నవంబర్ 26 (మంగళవారం) ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ టాక్ నివేదిక ప్రకారం.. ఈ సమావేశంలో బీసీసీఐతో పాటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సహా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాల్గొనే అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ప్రధానంగా టోర్నీ నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
హైబ్రిడ్ మోడ్లో టోర్నీని నిర్వహించాలా? పాక్లో కాకుండా మరో దేశంలో టోర్నీని నిర్వహించాలా ? హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తే భారత్, పాక్ మ్యాచ్ వేదికతో పాటు సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ వేదికను చర్చించనుందట. ఈ సమావేశం తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ, షెడ్యూల్తో మిగిలిన అంశాలపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. హైబ్రిడ్ మోడ్కు ఒప్పుకోమని, పాక్లో కాకుండా వేరే దేశంలో టోర్నీని నిర్వహిస్తే తాము తప్పుకుంటామని పాక్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. డ్రాప్ట్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఈ టోర్నీ కోసం పీసీబీ మూడు వేదికలను ఎంపిక చేసింది. భారత జట్టు ఆడే మ్యాచులను లాహోర్ వేదికగా నిర్వహించాలని ప్రతిపాదించింది. ఒకవేళ హైబ్రిడ్ మోడ్లో నిర్వహిస్తే.. టీమ్ఇండియా ఆడే మ్యాచులు అన్ని యూఏఈ వేదికగా జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Tilak Varma : చరిత్ర సృష్టించిన తిలక్ వర్మ.. టీ20ల్లో వరుసగా మూడో సెంచరీ..