World Cup final : ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో కలకలం.. కాసేపు ఆగిపోయిన మ్యాచ్.. ఏం జరిగిందంటే..?
World Cup final 2023 : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో ఊహించని అవాంతరం ఏర్పడింది.
వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్లో ఊహించని అవాంతరం ఏర్పడింది. దీంతో మ్యాచ్ను కాసేపు నిలిపివేశారు. పాలస్తీనాకు మద్దతుగా ఓ వ్యక్తి సెక్యూరిటీ సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి ప్రవేశించాడు. ఈ ఘటన భారత ఇన్నింగ్స్ సందర్భంగా చోటు చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది.
భారత జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 14వ సమయంలో పాలస్తీనా పై బాంబు దాడులు ఆపండి అని రాసి ఉన్న తెల్లటి టీ షర్టు, ఎర్ర రంగు షార్ట్ ధరించిన ఓ వ్యక్తి మైదానంలోకి దూసుకువచ్చాడు. ముఖానికి మాస్క్ ధరించిన సదరు వ్యక్తి పిచ్ వద్దకు దూసుకువచ్చాడు. ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ వద్దకు వచ్చి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకుని అదుపులోకి తీసుకుని మైదానం నుంచి బయటకు తరలించారు. ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్ వెనుక ఫ్రీ పాలస్తీనా అని రాసిఉంది.
Rohit Sharma : రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ప్రపంచ కెప్టెన్లలో ఒకే ఒక్కడు
ఈ అనుకోని ఘటన కారణంగా మ్యాచ్ కాసేపు ఆగిపోయింది. అతడిని బయటకు తీసుకువెళ్లిన తరువాత మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. కాగా.. అతడిని అహ్మదాబాద్లోని చంద్ఖేడా పోలీస్ స్టేషన్కు తరలించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన మెరుపు దాడిలో 1200 మంది మరణించగా 240 మంది పౌరులను హమాస్ బందీలుగా చేసుకుంది. నాటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ల మధ్య యుద్ధం జరుగుతోంది. హమాస్ను పూర్తిగా అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇజ్రాయెల్. ఈ క్రమంలో గాజా పై విరుచుకుపడుతోంది.
#ICCCricketWorldCup | Security breach during the India versus Australia ICC World Cup 2023 Final match, in Ahmedabad after a spectator entered the field
(Pics: ANI Photos) pic.twitter.com/AfilmF75sB
— ANI (@ANI) November 19, 2023
#WATCH | Gujarat: The man who entered the field during the India vs Australia Final match, brought to the Chandkheda Police Station in Ahmedabad pic.twitter.com/pm9AMyhsSi
— ANI (@ANI) November 19, 2023