IPL 2024 : కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయిన చిన్నస్వామి స్టేడియం.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ స్టేజీపైకి వచ్చే సమయంలో చినస్వామి స్టేడియంలోని ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ కోహ్లీ నామస్మరణ చేశారు

IPL 2024 : కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయిన చిన్నస్వామి స్టేడియం.. వీడియో వైరల్

RCB Team

Virat Kohli : చిన్నస్వామి స్టేడియం విరాట్ కోహ్లీ నామస్మరణతో దద్దరిల్లిపోయింది. ఐపీఎల్ -2024 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఐపీఎల్ సందడి మొదలైంది. విదేశీ క్రికెటర్లు కూడా తమతమ జట్టు సభ్యులతో భాగస్వాములవుతున్నారు. ఆర్సీబీ జట్టు ఈసారి ఏలాగైనా ఛాంపియన్ గా నిలవాలని పట్టుదలతో ఉంది. తాజాగా మంగళవారం రాత్రి చిన్నస్వామి స్టేడియంలో భారీసంఖ్యలో హాజరైన ప్రేక్షకుల సమక్షంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ) అన్‌బాక్స్‌ ప్రోగ్రామ్‌ జరిగింది. ఇందులో రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధానీతో పాటు జట్టు సభ్యులు పాల్గొన్నారు.

Also Read : Rohit sharma : రోహిత్ శర్మ సూప‌ర్ బ్యాటింగ్‌.. ఈ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

విరాట్ కోహ్లీ స్టేజీపైకి వచ్చే సమయంలో చినస్వామి స్టేడియంలోని ప్రేక్షకులు కోహ్లీ కోహ్లీ అంటూ కోహ్లీ నామస్మరణ చేశారు. కనీసం పావుగంట పాటు ఆ ప్రాంతమంతా కోహ్లీ పేరుతో ధ్వనించిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే.. ఈ కార్యక్రమంలో కెప్టెన్ డు ప్లెసిస్ తో కలిసి విరాట్ కోహ్లీ, స్మృతి మంధానలు ఆర్సీబీ పురుషుల జట్టు నూతన జెర్సీని విడుదల చేశారు. అనంతరం వారు నూతన జెర్సీలను ధరించి అభిమానులను అలరింపజేశారు. ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ కొద్దిసేపు కన్నడంలో మాట్లాడి ప్రేక్షకులను ఉత్సాహపర్చారు.

Also Read : టీమిండియాతో టెస్ట్ సిరీస్‌.. వేదికలను ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆర్సీబీ జట్టు ఒక్కసారికూడా టైటిల్ దక్కించులేక పోయింది. తాజాగా డబ్ల్యూపీఎల్ 2024 విజేతగా ఆర్సీబీ మహిళా జట్టు నిలిచింది. ఇప్పుడా స్ఫూర్తితో ఐపీఎల్ లోనూ పురుషుల టీమ్ చెలరేగిపోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. ఈసారైనా ఆర్సీబీ జట్టు ఛాంపియన్ గా నిలిస్తుందా.. మళ్లీ ఫ్యాన్స్ కు నిరాశనే మిగుల్చుతుందా అనేది వేచి చూడాల్సిందే.