Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో ప్ర‌పంచంలోనే ఒకే ఒక్క‌డు.. దీన్ని ట‌చ్ చేసే ఆట‌గాడే లేడు..

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు.

Virat Kohli : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. టీ20 క్రికెట్‌లో ప్ర‌పంచంలోనే ఒకే ఒక్క‌డు.. దీన్ని ట‌చ్ చేసే ఆట‌గాడే లేడు..

Courtesy BCCI

Updated On : May 28, 2025 / 8:43 AM IST

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో ఓ జ‌ట్టు త‌రుపున 9వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఏకైక ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. మంగ‌ళ‌వారం ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో వ్య‌క్తిగ‌త స్కోరు 24 ప‌రుగుల వ‌ద్ద కోహ్లీ ఈ ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌తో పాటు ఛాంపియ‌న్స్ లీగ్‌టీ20తో క‌లిపి కోహ్లీ ఆర్‌సీబీ త‌రుపున 9వేల ప‌రుగులు సాధించాడు.

ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ ముంబై త‌రుపున 6060 ర‌న్స్ చేశాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా జేమ్స్ విన్స్‌, సురేశ్ రైనా, ధోని త‌దిత‌రులు ఉన్నారు.

IPL 2025 : చరిత్ర సృష్టించిన శ్రేయస్ అయ్యర్‌.. ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకే ఒక్క‌డు.. రోహిత్, ధోని, కోహ్లీల‌కు సాధ్యం కాలేదు

ఇక ల‌క్నోతో మ్యాచ్‌లో కోహ్లీ మొత్తంగా 30 బంతులు ఎదుర్కొన్నాడు. 10 ఫోర్ల సాయంతో 54 ప‌రుగులు చేశాడు.

టీ20 క్రికెట్‌లో ఓ జ‌ట్టు త‌రుపున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు వీరే..
విరాట్ కోహ్లీ (ఆర్‌సీబీ) – 9030 ప‌రుగులు
రోహిత్ శ‌ర్మ (ముంబై ఇండియ‌న్స్‌) – 6060 ప‌రుగులు
జేమ్స్ విన్స్ (హాంప్‌షైర్‌) – 5934 ప‌రుగులు
సురేశ్ రైనా (సీఎస్‌కే) – 5529 ప‌రుగులు
ఎంఎస్ ధోని (సీఎస్‌కే) – 5314 ప‌రుగులు

ఐపీఎల్‌లో అత్య‌ధిక సార్లు 600 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లోనూ కోహ్లీ 600 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. వ‌రుస‌గా మూడో సారి ఈ ఘ‌న‌త అందుకున్నాడు. త‌న ఐపీఎల్ కెరీర్‌లో ఇలా ఓ సీజ‌న్‌లో 600 ర‌న్స్ చేయ‌డం ఇది ఐదో సారి. ఈ క్ర‌మంలో ఐపీఎల్ సీజ‌న్ల‌లో అత్య‌ధిక సార్లు 600 ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లీ నిలిచాడు.

ఐపీఎల్ సీజ‌న్ల‌లో అత్య‌ధిక సార్లు 600 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

విరాట్ కోహ్లీ – 5 సార్లు (2013, 2016, 2023, 2024, 2025)
కేఎల్ రాహుల్ – 4 సార్లు (2018, 2020, 2021, 2022)
క్రిస్ గేల్ – 3 సార్లు (2011, 2012, 2013)
డేవిడ్ వార్న‌ర్ – 3 సార్లు (2016, 2017, 2019)

PBKS vs MI : ముంబై పై విజ‌యం.. పంజాబ్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఒకరినొకరు వెన్నుపోటు పొడుచుకోవడం సులభం..

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోహ్లీ 60.20 స‌గ‌టు 147.91 స్ట్రైక్‌రేటుతో 602 ప‌రుగులు చేశాడు.