Karun Nair : ఇంగ్లాండ్తో నాలుగో టెస్టు.. గుడ్ బై చెప్పేసిన కరుణ్ నాయర్..
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

Karun Nair returns to Karnataka ahead of the 2025 domestic season
టీమ్ఇండియా వెటరన్ ఆటగాడు కరుణ్ నాయర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. 2025-26 దేశీయ సీజన్కు ముందు తన సొంత జట్టు కర్ణాటకకు తిరిగి వచ్చాడు. రెండు సీజన్ల పాటు విదర్భకు ప్రాతినిథ్యం వహించిన ఈ ఆటగాడు.. ఆ జట్టుకు గుడ్ బై చెప్పేశాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం.
2022లో కర్ణాటక జట్టులో చోటు కోల్పోయాడు కరుణ్ నాయర్. దీంతో విదర్భ తరుపున తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు. రెండు (2023, 2024) సీజన్లలో విదర్భ తరుపున అద్భుతంగా రాణించాడు.
ముఖ్యంగా రంజీ ట్రోఫీ 2024-25 సీజన్లో ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ ప్రదర్శన అమోఘం. 16 ఇన్నింగ్స్ల్లో 53.93 సగటుతో 863 పరుగులు చేశాడు. విదర్భను ఛాంపియన్గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాత విజయ్ హజారే ట్రోఫీలో 779 రన్స్ సాధించాడు.
ఈ ప్రదర్శనలతో 8 ఏళ్ల తరువాత టీమ్ఇండియా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. రీ ఎంట్రీలో అతడు ఆశించిన విధంగా రాణించలేదు. మూడు టెస్టుల్లో 6 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 131 పరుగులు మాత్రమే చేశాడు.
ENG vs IND : భారత్తో నాలుగో టెస్టు.. రూట్ గనుక 31 పరుగులు చేస్తే..
జూలై 23 నుంచి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే భారత్ 1-2 తేడాతో సిరీస్లో వెనుకబడి ఉంది. ఈ సమయంలో నాలుగో టెస్టులో భారత తుది జట్టులో కరుణ్ నాయర్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అతడికి బదులుగా సాయి సుదర్శన్ ను జట్టులోకి తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నారు.