తొలి టీ20 ముందు ఆసీస్కు ధోనీ వార్నింగ్

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ఆసీస్తో టీ20 పోరుకు ముందు సీరియస్గా కనిపిస్తున్నాడు. ఫామ్ కోల్పోయాడంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ధోనీ.. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో తాను ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించుకున్నాడు. ఫిబ్రవరి 24నుంచి సొంతగడ్డపై తలపడనున్న భారత్కు వైజాగ్ వేదిక కానుంది.
తొలి టీ20ని వైజాగ్లో, రెండో టీ20ని బెంగళూరులో ఆడేందుకు సిద్ధమవుతోన్న టీమిండియా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ఫొటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్లో పోస్టు చేస్తూ .. ‘ధోనీ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆసీస్ పాలిట సింహస్వప్నంలా మారనున్నాడు’ అంటూ వీడియో పెట్టింది.
ఏడు మ్యాచ్ల సిరీస్గా జరగనున్న భారత్లో ఆస్ట్రేలియా పర్యటన 2 టీ20లు, 5 వన్డేలుగా జరగనుంది. ఈ మ్యాచ్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రిలు ఆసీస్తో మ్యాచ్లు వరల్డ్ కప్ జట్టు కూర్పుకు చక్కగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
Belting it at the nets @msdhoni ????? #TeamIndia @Paytm #INDvAUS pic.twitter.com/hRDZUE5MvX
— BCCI (@BCCI) February 23, 2019