TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త డీఏతో పాటు పెండింగ్‭లో ఉన్న 9 డీఏలు మంజూరు

టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు

TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త డీఏతో పాటు పెండింగ్‭లో ఉన్న 9 డీఏలు మంజూరు

DA for TSRTC: తమ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న కరువు భత్యాలు(డీఏ) అన్నింటినీ మంజూరు చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ ఏడాది జులై నుంచి ఇవ్వాల్సి ఉన్న 4.8 శాతం డీఏను కూడా సిబ్బందికి మంజూరు చేయాలని యాజమాన్యం తాజాగా నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అక్టోబర్ నెల వేతనంతో కలిపి ఈ డీఏను సిబ్బందికి చెల్లిస్తున్నట్లు ప్రకటించారు.

“టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తూ.. వారిని క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ వృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోన్న సంస్థ.. క్లిష్ట పరిస్థితుల్లోనూ 2019 నుంచి విడతల వారిగా ఇప్పటివరకు 9 డీఏలను మంజూరు చేసింది. తాజా డీఏ మంజూరుతో అన్ని డీఏలను సంస్థ ఉద్యోగులకు చెల్లించింది.” అని టీఎస్ఆర్టీసీ సజ్జనర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి:

Sanjay Singh Arrest: ఢిల్లీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్ అరెస్ట్

Caste Census: ముస్లిం సమాజంలోని నమ్మలేని నిజాల్ని బయట పెట్టిన బిహార్ కులగణన సర్వే