Bandi Sanjay: ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తుచేస్తూ బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే?

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.

Bandi Sanjay: ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తుచేస్తూ బండి సంజయ్ ఆగ్రహం.. ఎందుకంటే?

Bandi Sanjay

Updated On : February 2, 2024 / 4:47 PM IST

తెలంగాణ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ ప్రకటిస్తామని చేసుకున్న ప్రచారాన్ని బండి సంజయ్ గుర్తు చేశారు.

ఫిబ్రవరి 1 వచ్చింది గ్రూప్ 1 నోటిఫికేషన్ ఎక్కడ? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. గ్రూప్-1 నియామకాలను ఉంటాయని హామీ ఇచ్చారని అన్నారు. అందులో డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు మొదలుకుని 24 రకాల పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొన్నారని బండి సంజయ్ అన్నారు.

ఇవాళ ఫిబ్రవరి 2 అని గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదని అన్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా వేయలేదని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల పక్షాన గ్రూప్ -1తో పాటు గ్రూప్-2 నియామకాలకు కూడా వెంటనే నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.

Magunta Sreenivasulu Reddy: టీడీపీలోకి వైసీపీ ఎంపీ మాగుంట.. కుమారుడు రాఘవ రెడ్డిని బరిలోకి?