MP Bandi Sanjay : అయోధ్య రామయ్య అందరికీ దేవుడు.. కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదన్న బండి సంజయ్

మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు.. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యుడీషియల్ విచారణ అడుగుతున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

MP Bandi Sanjay : అయోధ్య రామయ్య అందరికీ దేవుడు.. కాంగ్రెస్ రాజకీయం చేయడం తగదన్న బండి సంజయ్

Bandi Sanjay

Telangana BJP : అయోధ్య రామయ్య అందరికీ దేవుడు.. ప్రతి భారతీయుడు రాముడి విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రామ మందిర నిర్మాణం బీజేపీకి సంబంధించిన కార్యక్రమం కానేకాదన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు బహిష్కరించడం ఆశ్చర్యంగా ఉందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రామ మందిర నిర్మాణానికి సానుకూలమా? వ్యతిరేకమా? స్పష్టం చేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. పవిత్రమైన కార్యక్రమాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని అన్నారు.

Also Read : Ayodhya Rama Padukalu : అయోధ్య రాముని పాదుకలు తయారు చేసిన రామలింగాచారి

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ చెప్పిందని సంజయ్ అన్నారు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ ఎందుకు జరిపించడం లేదు.. కేవలం మేడిగడ్డ బ్యారేజీపైనే ఎందుకు జ్యుడీషియల్ విచారణ అడుగుతున్నారని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ విచారణ జరిపేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కాంగ్రెస్ తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉందన్నారు. ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోరాలని బండి సంజయ్ సూచించారు.