Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది.

Bandi Sanjay : భారీ కాన్వాయ్‌తో గద్వాల్‌కు బండి సంజయ్.. ఈ సాయంత్రమే రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర..!

Bandi Sanjay Praja Sangrama Yatra To Be Started From Today In Gadwala District

Updated On : April 14, 2022 / 3:27 PM IST

Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండవ విడత ప్రజా సంగ్రామ యాత్ర మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. గురువారం (ఏప్రిల్ 14) సాయత్రం గద్వాల జిల్లాలోని అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయం వద్ద నుంచి పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ అమ్మవారి ఆలయ దర్శనానికి బండిసంజయ్ కాన్వాయ్ బయల్దేరింది.

ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బండి సంజయ్ హైదరాబాద్ నుంచి అలంపూర్ చేరుకోనున్నారు. ముందుగా అలంపూర్ లో అంబెడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించనున్నారు బండి సంజయ్. అనంతరం సాయంత్రం 4 గంటలకు జోగులాంబ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహాంచనున్నారు.

Bandi Sanjay Praja Sangrama Yatra To Be Started From Today In Gadwala District (1)

Bandi Sanjay Praja Sangrama Yatra To Be Started From Today In Gadwala District

అనంతరం ఈ సాయంత్రం 5గంటలకు నిర్వహించే బహిరంగ సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ఛుగ్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం బండి సంజయ్ తొలిరోజు జోగులాంబ అమ్మవారి చెంత నుంచి నాలుగు కిలో మీటర్లు పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇమ్మాపూర్ వరకు పాదయాత్ర బండి సంజయ్ కొనసాగనుంది. ఈ రాత్రి ఇమామ్‌పూర్‌లోనే ఆయన బస చేయనున్నారు.

ఈ రోజు రాత్రి జోగులాంబ గద్వాల్ జిల్లా ఇమ్మాపూర్ ప్రాంతానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేరుకోనున్నారు. ఈయన కూడా అక్కడే బస చేయనున్నారు. పాదయాత్ర శిబిరం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి కిషన్ రెడ్డి భోజనం చేయనున్నారు. ఈ పాదయాత్ర శిబిరంలోనే తొలిరోజు రాత్రి కిషన్ రెడ్డి విడిది చేయనున్నారు. శుక్రవారం ఉదయం బండి సంజయ్‌తో కలిసి కిషన్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు.

Read Also : Bandi Sanjay: నేటి నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. 31 రోజులు.. 10 నియోజకవర్గాల్లో..