Kcr : నన్ను జైలుకి పంపుతారా? కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఫైర్

బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది.

Kcr : నన్ను జైలుకి పంపుతారా? కాంగ్రెస్ నేతలపై కేసీఆర్ ఫైర్

Kcr Slams Cm Revanth Reddy

Kcr : కేసీఆర్ ను తీసుకెళ్లి జైళ్లో వేస్తామని అంటున్నారు. జైళ్లకు భయపడే వాడినే అయితే ఉద్యమం చేసేవాడినా? అని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. నీ గుడ్లు పీకుతా.. నిన్ను జైళ్లో వేస్తా.. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేసీఆర్. మిర్యాలగూడలో రోడ్ షో లో కేసీఆర్ మాట్లాడారు. జిల్లాలో చేతకాని మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. సాగర్ లో నీళ్లు ఉన్నా సాగునీరు విడుదల చేయలేరని విమర్శించారు. ”కేసీఆర్ దిగగానే కరెంట్ పోయింది. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు. జిల్లా మంత్రులకు నన్ను తిట్టడమే పని” అని విరుచుకుపడ్డారు కేసీఆర్.

”ఇవాళ వస్తుంటే అర్జాలబావిలో ఐకెపి కేంద్రంలో ఆగి రైతులతో మాట్లాడాను. 25 రోజుల నుండి ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. మా హయాంలో కేంద్రంతో కొట్లాడి ధాన్యం కొనుగోలు చేశాం. అడ్డగోలు హామీలు ఇచ్చి, మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదు?

సాగర్ కింద 18 పంటలు పండించాము. ఈ ప్రాంత ప్రజలకు కరువు ఉండకూడదని కాళేశ్వరం నీళ్లు మూసీ ద్వారా ఉదయసముద్రంకు తరలించాలని ప్రణాళికలు వేశాను. అంబేడ్కర్ జయంతికి ఆయన విగ్రహానికి దండ వేసేందుకు కూడా సీఎంకు, మంత్రులకు సమయం లేదు. నిలువెత్తు అంబేడ్కర్ విగ్రహానికి తాళం వేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారు తిట్టుకుంటూ వెళ్లారు. బీఆర్ఎస్ కు ఎంపీలు ఇస్తే కేంద్రం, రాష్ట్రం మెడలు వంచుతా. మే 13న జరిగే ఎన్నికల్లో కృష్ణారెడ్డిని గెలిపించండి” అని పిలుపునిచ్చారు కేసీఆర్.

Also Read : కేసీఆర్ కాన్వాయ్‌లో ప్రమాదం, 8 కార్లు ఢీ..