YS Sharmila : సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila : తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని అన్నారు.

YS Sharmila : సీఎం కేసీఆర్‌పై వైఎస్ షర్మిల సంచలన ట్వీట్

YS Sharmila

YS Sharmila – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ టార్గెట్ గా వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శల దాడి కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ పై ఆమె చెలరేగిపోతున్నారు. ఘాటైన ట్వీట్లతో రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. తాజాగా మరోసారి ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్ పై ట్వీట్ లో విరుచుకుపడ్డారు.

మంది సొమ్ముతో కేసీఆర్ జల్సా చేస్తున్నారని ట్వీట్ చేశారు షర్మిల. ప్రజల కష్టాన్ని, రక్తాన్ని ఎలా పీక్కుతినాలో వీరి నుంచే నేర్చుకోవాలని మండిపడ్డారు. మహారాష్ట్రలో తిరుగుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఖర్చులను ఏ ఖాతాలో జమ చేస్తారని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కట్టే పన్నులతో కేసీఆర్ కాన్వాయ్ లు మహారాష్ట్రలో ఎలా తిరుగుతున్నాయని నిలదీశారు. తొమ్మిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 5లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని అన్నారు.

Also Read..BRS Expansion: స‌ర్వే సంస్థల నివేదిక‌ల ఆధారంగా.. జాతీయస్థాయిలో కేసీఆర్ పకడ్బందీ స్కెచ్‌!

కాళేశ్వరం ప్రాజెక్టులో మింగిన లక్షన్నర కోట్ల కమిషన్లు చాలక.. ఇసుక, గనులు, గ్రానైట్, భూములను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు షర్మిల. వీరి డాబుల కోసం దర్పాల కోసం, రాష్ట్ర ఆస్తులను పక్క రాష్ట్రాల్లో బరితెగించి వాడుకుంటున్నారని ఆరోపించారు షర్మిల. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్ కు బొంద పెట్టడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉందన్నారు షర్మిల.

Also Read..Eatala Rajender : రేపు ఈటల రాజేందర్ దంపతుల ప్రెస్‌మీట్.. ఏం ప్రకటన చేస్తారోనని తీవ్ర ఉత్కంఠ