KTR : బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

2014లో బడే భాయ్ మోడీ మోసం చేశారు. 2019లో చోటే భాయ్ రేవంత్ రెడ్డి మోసం చేశారు.

KTR : బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదే- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR : బీజేపీపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉన్నారని ఆయన హెచ్చరించారు. కరీంనగర్ లో కేటీఆర్ మాట్లాడారు. కావేరి, గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందని.. నియోజకవర్గాల పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించే ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు.

”బండి సంజయ్ ఒక్క పని అయినా చేశారా? బీజేపీ అబద్ధపు ప్రచారాలు చేస్తోంది. 2014లో బడే భాయ్ మోడీ మోసం చేశారు. జన్ ధన్ ఖాతాలు చేయమన్నారు. ఎవరికైనా డబ్బులు వేశారా? చోటే భాయ్ రేవంత్ ను గెలిపించిందుకు ప్రజలు సిగ్గు పడుతున్నారు. అలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేవాడే ఉండడు. ఎవడో పిచ్చోడు అని అంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాము. బండి సంజయ్ కు ఏమీ తెలియదు. ఆయనకు తెలియదన్న విషయం కూడా తెలియదు.

దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి బండి. ఇలాంటి బీజేపీ నాయకుడిని ఓట్లతోనే తొక్కాలి. జీఎస్టీ రూపంలో రాష్ట్రాల నుంచి 30 లక్షల కోట్లు వసూలు చేశారు. ఆదాని కంపెనీకి 15 లక్షలు కోట్లు మాఫీ చేసిన మోడీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెడతారు తప్ప ఏమీ చేయలేరు. మళ్ళీ మన కాలర్ ఎగరెయ్యాలి అంటే 10 నుంచి 12 ఎంపీ స్థానాల్లో గెలిపించాలి. అందరూ మీ మీ బూత్ స్థాయిలో ఓట్లు పెంచితే మనం గెలిచినట్లు” అని కేడర్ తో అన్నారు కేటీఆర్.

Also Read : రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు