Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు బంగారం ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.80వేలకు చేరగా.. శనివారం రూ. 500 తగ్గింది.

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు బంగారం ధర ఎంతో తెలుసా?

Gold Price

Updated On : August 26, 2023 / 10:13 AM IST

Gold and Silver Prices Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉండగా.. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతుండగా.. వెండి ధర శుక్రవారం కంటే కాస్త తగ్గింది. పెళ్లిళ్ల సీజన్ కావటంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. ఈనెల ప్రారంభం నుంచి తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్నాయి. ఇదిలాఉంటే కిలో వెండి శుక్రవారం రూ.80వేలకు చేరగా శనివారం కాస్త తగ్గుదల కనిపించింది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో శుక్రవారంతో పోల్చుకుంటే శనివారం గోల్డ్ ధరల్లో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదు. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22క్యారెట్ల బంగారం ధర రూ.54,500గా ఉంది. 24 క్యారెట్ల బంగారం రూ. 59,450 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, వరంగల్, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకోలేదు.

Gold

Gold

దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 54,650 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,600గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 54,750కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,730గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,450 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల పది గ్రాముల పసిడిధర రూ. 54,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,450గా ఉంది.

Gold

Gold

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు తగ్గాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.80వేలకు చేరగా.. శనివారం రూ. 500 తగ్గింది. దీంతో శనివారం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర రూ. 79,500గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీలో కిలో వెండి రూ. 76,400 లుగా ఉంది. ముంబైలో కిలో వెండి ధర రూ. 76,400 కాగా, చెన్నైలో రూ. 79,500 గా ఉంది. బెంగళూరులో రూ. 75 వేలు, కోల్ కతాలో రూ. 76,400 వద్ద కిలో వెండి ధర కొనసాగుతుంది.